News August 27, 2024

ఆదిలాబాద్‌లో నేడు ఏజెన్సీ బంద్‌కు పిలుపు

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ బంద్‌ను మంగళవారం నిర్వహిస్తున్నట్లు ఆదివాసీ సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఏజెన్సీలోని గిరిజనుల సమస్యల పరిష్కరణ, ఐటీడీఎలోని బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీపై బంద్ నిర్వహిస్తున్నామన్నారు. దీంతో అన్ని సంఘాల నాయకులు, వ్యాపారస్తులు సహకరించాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి, ఆదివాసీ విద్యార్థి సంఘం, తుడుందెబ్బ నాయకులు పేర్కొన్నారు.

Similar News

News February 9, 2026

ఎన్నికల కౌంటింగ్ పారదర్శకంగా నిర్వహించాలి: ADB కలెక్టర్

image

ఆదిలాబాద్ మున్సిపాలిటీ సాధారణ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం నిర్వహించాలని కలెక్టర్ రాజర్షిషా అధికారులను ఆదేశించారు. కౌంటింగ్ సూపర్వైజర్లు, అసిస్టెంట్లకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో ఆయన పాల్గొని దిశానిర్దేశం చేశారు. పోలింగ్‌తో పాటు కౌంటింగ్ ప్రక్రియ కూడా అత్యంత కీలకమని, కౌంటింగ్ సిబ్బందికి ప్రతి అంశంపై పూర్తి అవగాహన ఉండాలని సూచించారు.

News February 9, 2026

ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

image

మున్సిపల్ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సిబ్బందికి సూచించారు. ఎన్నికల నేపథ్యంలో సోమవారం కలెక్టరేట్ కార్యాలయ ఛాంబర్‌లో పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ సిబ్బంది కేటాయింపుకు సంబంధించిన మూడవ విడత రాండమైజేషన్ ఎన్నికల సాధారణ పరిశీలకులు హనుమంత్ నాయక్ తో కలిసి పరిశీలించారు. మున్సిపల్ కమిషనర్ రాజు, నోడల్ అధికారి ఫణిందర్, ఎన్నికల సిబ్బంది, తదితరులు ఉన్నారు

News February 9, 2026

ఆదిలాబాద్: ప్రచారానికి ముఖ్యనేతలేవరు రాలే..!

image

ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ప్రచార పర్వం నేటితో ముగియనుంది. కాసేపట్లో మైకులు మూగబోనున్నాయి. అయితే ఇప్పటివరకు ప్రధాన పార్టీల ముఖ్యనేతలు ఎవరుకుడా ప్రచారానికి రాలేదు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మాత్రమే జిల్లా కేంద్రంలో పర్యటించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, అటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ప్రచారానికి వస్తారనే ప్రచారం సాగినప్పటికీ వారి పర్యటనపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత లేదు.