News February 6, 2025

ఆదిలాబాద్‌లో 100 రోజుల TB క్యాంపెనింగ్

image

జిల్లాలో వందరోజుల టీబీ క్యాంపెనింగ్‌లో వల్నరబుల్ పాపులేషన్స్‌కి వాహనాల ద్వారా ఎక్స్రే రేకు పంపాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఎపిడెమిక్ సెల్, ఆర్బీఎస్కే వాహనాలను 100 రోజుల శిబిరానికి వినియోగించుకోవాలన్నారు. అర్బన్ స్లమ్స్, 50 రోజుల్లో శిబిరాలు జరగని గ్రామాల్లో శిబిరాన్ని నిర్వహించాలని మెడికల్ ఆఫీసర్లకు సూచించారు. టీబీ లక్షణాలు కలిగిన వారిని గుర్తించాలన్నారు.

Similar News

News February 6, 2025

బోథ్: గుండెనొప్పితో ఉపాధ్యాయుడు మృతి

image

బోథ్‌లోని ప్రభుత్వ ఆదర్శ పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయుడు దేవరాజ్ గుండెపోటుతో మృతి చెందాడు. ఇచ్చోడ మండలం కోకస్ మున్నూరు గ్రామానికి చెందిన దేవరాజ్ బుధవారం ఎప్పటిలాగే పాఠశాల విధులకు హాజరయ్యాడు. సాయంత్రం గుండెలో నొప్పి వస్తుందని తోటి ఉపాధ్యాయులకు తెలపడంతో వారు ఆయన్ను ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. డాక్టర్లు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.

News February 6, 2025

ADB: అధికారులతో కలెక్టర్ సమావేశం

image

ఈ నెల 10న నిర్వహించే జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవాన్ని విజయవంతం చేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ట్రైనీ కలెక్టర్ అభిగ్యన్ మల్వియా, DMHO నరేందర్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ జై సింగ్ రాథోడ్, జిల్లా టీబీ నియంత్రణ అధికారి సుమలత, తదితరులు పాల్గొన్నారు.

News February 5, 2025

ఆదిలాబాద్: 35 మందిలో ఆరుగురు ఎంపిక

image

ఆదిలాబాద్‌లోని ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో బుధవారం TSKC, TASK ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాకు స్పందన లభించింది. ఈ జాబ్ మేళాలో హెచ్.ఈ.టీ.ఈ.ఆర్.ఓ లాబొరేటరీస్‌, ఫార్మాస్యూటికల్ ప్రొడక్షన్‌లో పోస్టులకు 35 మంది అభ్యర్థులు హాజరవ్వగా ఆరుగురు అభ్యర్థులను ఎంపిక చేసినట్లు కళాశాల ప్రిన్సిపల్ డా.సంగీత తెలిపారు. విద్యార్థులు తమకు నచ్చిన రంగంలో నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ ముందుకు సాగాలన్నారు.

error: Content is protected !!