News May 21, 2024
ఆదిలాబాద్: ఓటేయడానికి ముందుకురాని మహిళలు
ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లు 8,45,213 మంది ఉన్నారు. ఇందులో పార్లమెంట్ ఎన్నికల్లో 6,22,420 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరి పోలింగ్ 73.64 శాతంగా నమోదైంది. అలాగే పురుష ఓటర్లు 8,04,875 మంది ఓటర్లున్నారు. వీరిలో 5,99,108 మంది ఓటు వేశారు. వీరి పోలింగ్ శాతం 74.43గా నమోదైంది. 2,05,767 మంది పురుష ఓటర్లు ఓటు వేయలేదు. మహిళలే తక్కువ ఓటేశారు.
Similar News
News September 29, 2024
ఆదిలాబాద్: పల్లె ఓటర్ల లెక్క తేలింది
గ్రామ పంచాయతీల్లోని ఓటర్ల లెక్క తేలింది. సర్పంచ్, వార్డుసభ్యుల ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పంచాయతీల్లో వార్డుల వారీగా సిద్దం చేసిన ఫొటోలతో కూడిన ఓటర్ల తుది జాబితాను పంచాయతీ శాఖ అధికారులు శనివారం ప్రకటించారు. జిల్లాలోని 17 మండలాల్లో గల 473 గ్రామ పంచాయతీల పరిధిలో 4,41,795 మంది ఓటర్లు ఉన్నట్లుగా వెల్లడించారు. ఇందులో పురుషులతో పోల్చితే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది.
News September 29, 2024
ADB: మూడేళ్ల బాలికపై అత్యాచారయత్నం
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. పట్టణంలోని ఒక కాలనీలో 3 సంవత్సరాల బాలికపై 45 ఏళ్ల వ్యక్తి అత్యాచారయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆదిలాబాద్ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు.
News September 29, 2024
ఆసిఫాబాద్: ‘రాజీ మార్గమే రాజా మార్గం’
రాజీ మార్గమే రాజా మార్గమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంవి.రమేష్ అన్నారు. శనివారం ఆసిఫాబాద్ పట్టణంలోని కోర్టు ఆవరణలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలతో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లోక్ అదాలత్ ద్వారా కేసులను రాజీమార్గం ద్వారా పరిష్కరించుకోవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా కేసులను అక్కడికక్కడే పరిష్కరించినట్లు ఆయన తెలిపారు.