News October 5, 2024
ఆదిలాబాద్: ఓపెన్ డిగ్రీ, పీజీ అడ్మిషన్లకు గడువు పెంపు
డా.బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలో డిగ్రీ, పీజీలో ప్రవేశాలకై గడువు పొడగించినట్లు సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ డా. సంగీత తెలిపారు. డిగ్రీ, పీజీ, తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఉమ్మడి జిల్లా విద్యార్థులు తమకు నచ్చిన కోర్సులో చేరవచ్చని సూచించారు. SEP 30 వరకు గడువు పూర్తవగా దాన్ని OCT 15 వరకు పొడిగించినట్లు ఆమె వెల్లడించారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
>>SHARE IT
Similar News
News October 5, 2024
ఆదిలాబాద్: వయోజనులందరిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలి: కలెక్టర్
నిరక్షరాస్యులైన వయోజనులందరిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం కార్యక్రమాన్ని రూపొందించిందని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా ఆన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం సమావేశంలో కలెక్టర్ అధికారులతో సమావేశం నిర్వహించారు. 15 ఏళ్లుపై బడిన నిరక్షరాస్యులను గుర్తించి ఐదు దశల్లో వారికి శిక్షణా నిచ్చి అక్షరాస్యులుగా తీర్చదిద్దాలన్నారు.
News October 4, 2024
నిర్మల్ : నిరుద్యోగులకు వృత్తి నైపుణ్య శిక్షణను అందించాలి: కలెక్టర్
జిల్లాలోని నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి పొందేలా వృత్తి నైపుణ్య శిక్షణలను అందించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. నిరుద్యోగ యువతకు శిక్షణపై జిల్లాస్థాయి వృత్తి నైపుణ్య సొసైటీ ప్రతినిధులతో ఆమె సమావేశం నిర్వహించారు. జిల్లాల్లో నిరుద్యోగ యువతీ యువకులకు స్వయం ఉపాధి కల్పించేలా వృత్తి నైపుణ్య శిక్షణలు అందించాలని ఆదేశించారు.
News October 4, 2024
బాసర: ‘సరస్వతి దేవిని దర్శించుకున్న రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్’
బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య, కమిషన్ సభ్యురాలు కుస్రం నీలాదేవి శుక్రవారం దర్శించుకున్నారు. ముందుగా ఆలయ కమిటీ సభ్యులు వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వారికి తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు.