News March 22, 2026
ఆదిలాబాద్: గడప దాటితే నీటి యుద్ధమే

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తాగునీటి సమస్య కేవలం ఒక వార్తాంశం కాదు. జిల్లాలోని చాలా ప్రాంతాల్లో అక్కడి ప్రజల ప్రతిరోజూ సాగే కన్నీటి పోరాటం. ఎండ వేడిమి పెరిగే కొద్దీ, చిన్నారుల నుంచి వృద్ధుల వరకు నీటి చుక్క కోసం పడే ఆరాటం వర్ణనాతీతం. మారుమూల గ్రామాల్లో గడప దాటగానే మొదలయ్యే నీటి వేట, వారి కష్టాలను ప్రతిబింబిస్తోంది. దీంతో ఎండాకాలంలో నీటి సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటే మేలు.
Similar News
News April 14, 2026
భారత ఐక్యతకు రాజ్యాంగం ప్రధానం: కలెక్టర్, ఎస్పీ

విభిన్న కులాలు, మతాలు, భాషలు, సంస్కృతులు కలిగిన దేశం అయినప్పటికీ భారతదేశం ఐక్యంగా నిలబడటానికి ప్రధాన కారణం రాజ్యాంగమని భద్రాద్రి కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్ రాజు అన్నారు. ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే భారత రాజ్యాంగం చాలా తక్కువ సవరణలతో సమర్థవంతంగా కొనసాగుతుండటం అంబేద్కర్ దూరదృష్టికి నిదర్శనమన్నారు. కుల మతాలకు అతీతంగా సమానంగా జీవించడానికి రాజ్యాంగం స్ఫూర్తినిచ్చిందని అన్నారు.
News April 14, 2026
భారత ఐక్యతకు రాజ్యాంగం ప్రధానం: కలెక్టర్, ఎస్పీ

విభిన్న కులాలు, మతాలు, భాషలు, సంస్కృతులు కలిగిన దేశం అయినప్పటికీ భారతదేశం ఐక్యంగా నిలబడటానికి ప్రధాన కారణం రాజ్యాంగమని భద్రాద్రి కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్ రాజు అన్నారు. ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే భారత రాజ్యాంగం చాలా తక్కువ సవరణలతో సమర్థవంతంగా కొనసాగుతుండటం అంబేద్కర్ దూరదృష్టికి నిదర్శనమన్నారు. కుల మతాలకు అతీతంగా సమానంగా జీవించడానికి రాజ్యాంగం స్ఫూర్తినిచ్చిందని అన్నారు.
News April 14, 2026
ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరి: కలెక్టర్

ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఏప్రిల్ 14 నుంచి 20 వరకు నిర్వహించనున్న అగ్నిమాపక వారోత్సవాల గోడపత్రికను కలెక్టర్ అంకిత్ ఆవిష్కరించారు. అలాగే రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అరైవ్-అలైవ్ కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేయించారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను పాటించడం, హెల్మెట్, సీట్బెల్ట్ తప్పనిసరిగా వాడాలని, మద్యం తాగి వాహనం నడపొద్దని సూచించారు.


