News March 16, 2025
ఆదిలాబాద్: గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలు

2025-26 విద్యాసంవత్సరానికి జిల్లాలోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ వెల్ఫేర్ గురుకుల పాఠశాలల్లో 6,7,8,9 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు DCO కీర్తి తెలిపారు. 6వ తరగతి ప్రవేశానికి 31 ఆగస్టు 2025 నాటికి విద్యార్థులకు 12 ఏళ్లకు మించకూడదన్నారు. SC, ST విద్యార్థులకు రెండేళ్లు సడలింపు ఉంటుందని పేర్కొన్నారు. ఈ నెల 31లోపు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Similar News
News March 16, 2025
ఆదిలాబాద్లో AIRPORT.. AI PHOTO

ADBలో ఎయిర్పోర్ట్ ఏర్పాటు ఉమ్మడి జిల్లా ప్రజల కల. ఆ కలను నెరవేర్చే బాధ్యత తనదని CM రేవంత్రెడ్డి శనివారం అసెంబ్లీలో హామీ ఇచ్చారు. వరంగల్ తర్వాత ADBకే ప్రాధాన్యం ఇస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అయితే ఆదిలాబాద్లో ఎయిర్పోర్ట్ ఏర్పాటైతే ఉమ్మడిజిల్లా ప్రజలకు మేలు చేకూరనుంది. ఎయిపోర్ట్ ఏర్పాటైతే ఎలా ఉంటుందనే AI ఫొటోలు ఇప్పుడు ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఫొటోను చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి.
News March 16, 2025
తాంసి: GREAT.. మూడు ఉద్యోగాలకు సెలెక్ట్ అయ్యాడు

తాంసి గ్రామానికి చెందిన జానకొండ అశోక్ గ్రూప్-3 ఫలితాల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయిలో ర్యాంక్ సాధించాడు. ఇప్పటికే గ్రూప్-1లో 399 మార్కులు, గ్రూప్-2లో 380 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 250వ ర్యాంక్ సాధించాడు. గ్రూప్-3లో 284 మార్కులతో రాష్ట్ర స్థాయిలో 417వ ర్యాంక్ సాధించాడు. వరుసగా ప్రభుత్వ ఉన్నత ఉద్యోగాలు సాధిస్తున్న అశోక్ ప్రస్తుతం జైనథ్ మండలంలో చాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాడు.
News March 16, 2025
భీంపూర్: రెండు ఉద్యోగాలకు ఎంపిక

భీంపూర్ మండలం అర్లీ(T) గ్రామానికి చెందిన రామెల్లి శివ గ్రూప్-3లో ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయిలో 481 ర్యాంక్ సాధించాడు. ఇటీవల విడుదలైన గ్రూప్-2 ఫలితాల్లో సైతం ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయిలో 319 ర్యాంక్ సాధించి శభాష్ అనిపించుకున్నాడు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ఇది సాధ్యమైందని శివ పేర్కొన్నారు.