News March 5, 2025
ఆదిలాబాద్ జిల్లాలో నేటి TOP NEWS

■ జిల్లా వ్యాప్తంగా ఇంటర్ వార్షిక పరీక్షలు ప్రారంభం
■ గాంధీ భవన్లో ఆదిలాబాద్ నాయకులతో సమీక్షా సమావేశం
■ ఆదిలాబాద్కు ఏయిర్ పోర్ట్ తీసుకొస్తా: ఎంపీ
■ జోగురామన్న వ్యాఖ్యలను ఖండించిన ఆదిలాబాద్ ఎమ్మెల్యే
■ మహారాష్ట్రలో యాక్సిడెంట్.. 16 మంది జిల్లా వాసులకు గాయాలు
■ BJPలో చేరిన సాత్నాల గ్రామస్థులు
■ పట్టభద్రుల ఎమ్మెల్సీగా అంజిరెడ్డి
Similar News
News March 6, 2025
ఆదిలాబాద్: KU పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలు విడుదల

కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని రెగ్యులర్ డిగ్రీ సెమిస్టర్ పరీక్షల ఫీజు చెల్లింపు తేదీలను విడుదల చేసినట్లు KU అధికారులు పేర్కొన్నారు. 2, 4, 6 డిగ్రీ సెమిస్టర్కు సంబంధించిన పరీక్ష ఫీజు ఈనెల 25 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా చెల్లించవచ్చని పేర్కొన్నారు. రూ.50 అపరాధ రుసుముతో ఏప్రిల్ 2 వరకూ అవకాశముందన్నారు. పరీక్షలు ఏప్రిల్ నెలలో ఉంటాయని పేర్కొన్నారు.
News March 6, 2025
ADB: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురికి సిరీయస్

మహారాష్ట్రలో బుధవారం జరిగిన <<15659751>>ఘోర రోడ్డు ప్రమాదంలో<<>> జిల్లాకు చెందిన 16 మందికి గాయాలైన విషయం తెలిసిందే. కాగా వీరిలో ముగ్గురి పరిస్థితి విషయంగా ఉన్నట్లు బంధువులు తెలిపారు. గుడిహత్నూర్ మండలం గురిజ గ్రామానికి చెందిన వీరు మహారాష్ట్రలోని చంద్రపూర్ మహంకాళి అమ్మవారిని దర్శించుకొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో వీరు ప్రయాణిస్తు వాహనం బోల్తాపడింది.
News March 6, 2025
సిరికొండలో విద్యుత్ షాక్తో యువకుడి మృతి

విద్యుదాఘాతానికి గురై ఓ యువకుడు మృతి చెందిన ఘటన సిరికోండలో చోటుచేసుకుంది. ఎస్ఐ శివరాం వివరాల ప్రకారం.. తుమ్మలపాడ్ గ్రామానికి చెందిన విలాస్(28) ఇంటి గోడకున్నా విద్యుత్ వైర్ షాక్ తగలడంతో విద్యుదాఘాతానికి గురయ్యాడు. వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. విలాస్ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు.