News February 21, 2026
ఆదిలాబాద్ జిల్లాలో 13 పరీక్ష కేంద్రాలు: డీసీవో

గురుకులాల్లో ఐదవ తరగతి ఉమ్మడి పరీక్ష, 6, 7, 8, 9 తరగతులలో మిగిలిన సీట్లకు ప్రవేశ పరీక్షను ఈనెల 22న నిర్వహిస్తున్నట్లు డీసీఓ లలిత కుమారి పేర్కొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 13 పరీక్ష కేంద్రాలు ఉన్నాయనీ.. మొత్తం 4820 మంది బాలబాలికలు హాజరవుతున్నారని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు పరీక్ష కేంద్రానికి ఉదయం 10 గంటల్లోపు చేరుకోవాలని సూచించారు.
Similar News
News February 21, 2026
మెదక్లో అర్ధరాత్రి విచక్షణారహితంగా దాడి

మెదక్లోని శ్మశానవాటిక సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి సజీద్ అనే వ్యక్తిపై గుర్తుతెలియని వ్యక్తులు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. శనివారం ఉదయం గమనించిన స్థానికులు 108 సిబ్బందికి సమాచారం అందించారు. ఈఎంటీ రామవ్వ, పైలట్ రఘు ఘటనా స్థలానికి చేరుకుని బాధితుడికి ప్రథమ చికిత్స అందించి ఆసుపత్రికి తరలించారు. టౌన్ SI రుక్సానా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాధితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
News February 21, 2026
వినుకొండ చేరుకున్న CM చంద్రబాబు

సీఎం నారా చంద్రబాబు నాయుడు పల్నాడు జిల్లా వినుకొండ చేరుకున్నారు. ‘స్వచ్ఛ ఆంధ్ర.. స్వర్ణాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా ఆయన ఇక్కడ పర్యటించి పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలీసులు అన్ని భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. పార్టీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.
News February 21, 2026
YCP మాజీ ఎంపీ బుట్టా రేణుక ఆస్తుల వేలం

YCP మాజీ ఎంపీ బుట్టా రేణుక, ఆమె భర్త నీలకంఠ శివ ఆస్తులను వేలం వేయనున్నట్లు LIC హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ప్రకటించింది. వీరు ఆ కంపెనీ నుంచి గతంలో ₹340Cr లోన్ తీసుకున్నారు. కొంతకాలం తర్వాత వాయిదాలు కట్టడం ఆపేయడంతో బకాయిల మొత్తం ₹782.07Crకు చేరింది. దీంతో వారి ఆస్తుల వేలం ప్రక్రియను LIC ప్రారంభించింది. తాజాగా HYD KPHBలో 3,830 చ.గజాల స్థలం వేలానికి ప్రకటన ఇచ్చింది. దీని కనీస విలువ ₹65Crగా పేర్కొంది.


