News August 23, 2025

ఆదిలాబాద్: డ్రగ్ ఫ్రీ జిల్లాగా మార్చందుకు స్పెషల్ డ్రైవ్స్

image

ఆదిలాబాద్ జిల్లాను డ్రగ్ ఫ్రీగా మార్చే లక్ష్యంతో పోలీసులు మాదకద్రవ్యాలపై ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. బస్టాండ్, రైల్వే స్టేషన్, పలు కాలనీలు, దుకాణాల్లో నార్కోటిక్ స్నిఫర్ డాగ్ రోమా సహాయంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. గంజాయి సాగు చేసేవారు ప్రభుత్వ పథకాలకు అనర్హులుగా పరిగణిస్తారని పోలీసులు తెలిపారు. గంజాయి విక్రయించినా, కొనుగోలు చేసినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Similar News

News February 10, 2026

ADB: ఈ నెల 20 వరకు పత్తి కొనుగోళ్లు

image

సీసీఐ కేంద్రాలలో కొనుగోలు చేస్తున్న పత్తి ఈ నెల 20వ తేదీ వరకు మాత్రమే కొనుగోలు చేస్తామని జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి తెలిపారు. రైతులు పత్తి అమ్మెందుకు కపాస్ కిసాన్ యాప్‌లో స్లాట్ బుక్ చేసుకొవాలని సూచించారు. కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి రైతులకు వీలులేదన్నారు. పత్తి నిల్వ ఉన్న రైతులు తప్పకుండా త్వరగా సీసీఐలో విక్రయించి మద్దతు ధర పొందాలని వివరించారు.

News February 10, 2026

1000 మందితో ఎన్నికల బందోబస్తు: ADB SP

image

ఎన్నికల నిర్వహణకు జిల్లా వ్యాప్తంగా 1000 మంది పోలీసు సిబ్బందితో పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు SP అఖిల్ మహాజన్ తెలిపారు. బందోబస్తులో ముగ్గురు అదనపు ఎస్పీలు, 3 డీఎస్పీలు, 21 మంది సీఐలు, 48 ఎస్ఐలతో, మహిళా సిబ్బంది, హోంగార్డ్స్, రిజర్వు సిబ్బంది, సాయుధ సిబ్బంది, స్పెషల్ పార్టీ బలగాలచే బందోబస్తు ప్రక్రియ కొనసాగుతుందన్నారు. 10 వార్డులకు ఒక ఏఎస్పీ, డీఎస్పీ స్థాయి అధికారులు ఉంటారని వివరించారు.

News February 10, 2026

200 మంది బైండోవర్.. ఆయుధాలు డిపాజిట్: ADB SP

image

పోలింగ్ స్టేషన్ల పరిధిలో 163 BNSS అమలులో ఉంటుందని SP అఖిల్ మహాజన్ తెలిపారు. ప్రజలు గుమిగూడి ఉండకుండా, గొడవలకు అల్లర్లకు దారి తీయకుండా ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఇప్పటివరకు 200 మందిని బైండోవర్ చేశామ, 20 మంది నుంచి ఆయుధాలు డిపాజిట్ చేసుకున్నట్లు SP వెల్లడించారు. 86 కేసులు నమోదు చేశామన్నారు. 378లీ మద్యం, రూ.29,90,000 నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.