News April 10, 2024
ఆదిలాబాద్: నిండు గర్భిణీ మృతి

సిరికొండ మండలం పొన్న ఎక్స్ రోడ్కు చెందిన పేందుర్ విమల బాయి (25) అనే నిండు గర్భిణీ మృతి చెందింది. బంధువుల వివరాలు.. విమల బాయికి రక్తహీనత, విరేచనాలు ఎక్కువ అవ్వడంతో ఇచ్చోడ ఆస్పత్రికి తరలించారు. ఇక్కడ పరీక్షించిన వైద్యులు.. 108లో మెరుగైన వైద్యం కోసం ADB రిమ్స్ ఆసుపత్రికి తరలించగా మార్గమధ్యలో మృతి చెందినట్లు బంధువులు తెలిపారు.
Similar News
News April 13, 2026
ADB: మన ఇసుక – వాహనం’ పోర్టల్ పటిష్ఠ అమలుకు కలెక్టర్ ఆదేశం

ఇసుక బుకింగ్, రవాణా ప్రక్రియలో ఎలాంటి జాప్యం జరగకుండా, సమన్వయంతో పనిచేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా అధికారులను ఆదేశించారు. మన ఇసుక వాహనం పోర్టల్ పై అవగాహన, ఇతర అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇసుక బుకింగ్, రవాణా ప్రక్రియలో ఎలాంటి జాప్యం జరగకూడదని, అధికారులు సమన్వయంతో పని చేయాలని స్పష్టం చేశారు. ఇసుక బుకింగ్ సమయంలో సరైన పత్రాలను అప్లోడ్ చేయడం తప్పనిసరని స్పష్టం చేశారు.
News April 13, 2026
ఆదిలాబాద్లో మెగా ఇండస్ట్రియల్ పార్క్

దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు ఆదిలాబాద్ జిల్లాలో అడుగులు పడుతున్నాయి. విమానాశ్రయ నిర్మాణం ఖరారు కావడంతో సిమెంట్, ఫుడ్ ప్రాసెసింగ్, డిఫెన్స్ రంగాలకు అవకాశాలు పెరిగాయి. హైవే అనుసంధానం, చనాక-కోరాట నీటి వనరుల లభ్యత కలిసొచ్చే అంశాలు. బీంపూర్, జైనథ్, బోరజ్ మండలాల్లో సుమారు 2,000 ఎకరాల భూములను అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ మెగా పార్కుతో జిల్లా పారిశ్రామిక రూపురేఖలు మారనున్నాయి.
News April 13, 2026
ఇంటర్ ఫలితాల్లో ఆదిలాబాద్ జిల్లా పతనం

ఇంటర్ ఫలితాల్లో ADB జిల్లా 13వ స్థానం నుంచి 33వ స్థానానికి పడిపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. అధ్యాపకుల కొరత, సిలబస్ పూర్తికాకపోవడం, గ్రామీణ ప్రాంతాల్లో వనరుల లేమి ఫలితాలపై ప్రభావం చూపాయి. ఆర్థిక ఇబ్బందుల వల్ల విద్యార్థులు పనులకు వెళ్లడం, సరైన రివిజన్ లేకపోవడం వెనుకబాటుకు ప్రధాన కారణాలని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికైనా అధ్యాపకులను భర్తీ చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.


