News May 10, 2024

ఆదిలాబాద్: బీఆర్ఎస్ ప్రచార రథం బోల్తా.. తప్పిన ప్రమాదం

image

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రచారం నిర్వహిస్తున్న భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు ప్రచార రథం శుక్రవారం బోల్తాపడి తలకిందులు అయింది. బోథ్ మండలంలోని నాగపూర్ గ్రామానికి ప్రచార నిమిత్తం వెళ్లిన వాహనం గ్రామ సమీపంలో డ్రైవర్ అజాగ్రత్తగా నడపడంతో బోల్తా పడి తలకిందులు అయింది. అదృష్టవశాత్తు ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగక పోవడంతో ఆ పార్టీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారు.

Similar News

News February 6, 2026

ADB: రాజకీయాల వైపు ‘విద్యావంతుల’ చూపు

image

ADB మున్సిపల్ బరిలో అధికంగా విద్యావంతులు పోటీలో ఉండడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఉన్నత విద్యను అభ్యసించిన వారు సైతం ఎన్నికల్లో పోటీకి సై అంటున్నారు. 49 వార్డులకు గాను 314 మంది పోటీలో నిలిచారు. వీరిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ 13, గ్రాడ్యుయేషన్ 45, అండర్ గ్రాడ్యుయేషన్ 127, నిరక్షరాస్యులు 85, వివరాలు ఇవ్వనివారు 44 మంది ఉన్నారు. ఉద్యోగ అవకాశాలు రాకపోవడంతో నిరుద్యోగ యువత రాజకీయాల వైపు ఆసక్తి చూపుతున్నారు.

News February 5, 2026

ADB: అభ్యర్థులు ఖర్చు పెట్టేముందుకు జాగ్రత్త..!

image

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఖర్చులకు తగ్గ వివరాలను సమర్పించాల్సి ఉంటుందని, వాటి గురించి తెలుసుకోవాలని ఎన్నికల జిల్లా అబ్జర్వర్ హన్మంత్ నాయక్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నిబంధనల గురించి తెలుసుకోవాలని సూచించారు. తమకు ఎన్నికల కమిషన్ విధించిన లక్ష లోపే ఖర్చులు చేయాలన్నారు. ఖర్చులు ఎక్కువైతే గెలిచిన తరువాత కూడా డిస్ క్వాలిఫై అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు.

News February 5, 2026

ADB: రెబల్స్‌గా పోటీ.. ఒకే వేదికపై నలుగురు

image

మున్సిపల్ ఎన్నికల వేళా ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కంది శ్రీనివాస్ రెడ్డిపై రెబల్స్‌గా పోటీచేసిన నాయకులు సాజిద్ ఖాన్, సుజాత, శ్రీకాంత్ రెడ్డి ఇప్పుడు ఒకే వేదికపై కనిపించడం ఆశ్చర్యానికి గురిచేసింది. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం కాంగ్రెస్ అభ్యర్ధి తరఫున వారందరు ఒకే బృందంగా కలిసి ప్రచారం చేశారు.