News March 30, 2024

ఆదిలాబాద్: భానుడి భగభగలు.. బెంబేలెత్తుతున్న జనాలు..!

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రోజురోజుకు పెరుగుతున్న ఎండలు నిప్పుల కుంపటిని తలపిస్తూ జనాలను బెంబేలెత్తిస్తున్నాయి. శుక్రవారం రోజు నమోదైన ఉష్ణోగ్రతలు చూసుకుంటే. ఆదిలాబాద్ జిల్లాలో గరిష్టంగా 43.3 ఉష్ణోగ్రత నమోదయింది. కొమరం భీం జిల్లాలో 42.7, నిర్మల్ జిల్లాలో 42.3, మంచిర్యాల జిల్లాలో 42.0 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Similar News

News September 8, 2025

రేపటి లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి: DIEO

image

ఆదిలాబాద్ జిల్లాలోని 13 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ముఖ గుర్తింపు హాజరు (ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్) విధానాన్ని డీఐఈఓ జాదవ్ గణేష్ కుమార్ ప్రారంభించారు. మొత్తం 6,274 మంది విద్యార్థులకు గాను 3,599 మంది (57 శాతం) మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు. మిగతా విద్యార్థులు ఈ నెల 9లోగా తప్పకుండా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆయన సూచించారు.

News September 7, 2025

ప్రతి ఒక్కరికీ అభినందనలు: ఆదిలాబాద్ ఎస్పీ

image

ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా శాంతి, భక్తి వాతావరణంలో 600 మంది పోలీసులతోపాటు ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ విద్యార్థుల సహకారంతో నిమజ్జన ఉత్సవాలు విజయవంతంగా పూర్తి చేశామని ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదివారం పేర్కొన్నారు. మరోవైపు ఇందుకు పలు సంఘాలు, కమిటీలు, మండప నిర్వాహకులు, యువత సహకారం అభినందనీయమని ఆయన తెలిపారు.

News September 7, 2025

ఆదిలాబాద్: ‘బీఎస్పీతోనే బహుజనులకు రాజ్యాధికారం’

image

బీఎస్పీ ద్వారానే బహుజనులకు రాజ్యాధికారం సాధ్యమని బీఎస్పీ సెంట్రల్ స్టేట్ కోఆర్డినేటర్ అడ్వకేట్ నిషాని రామచంద్రం పేర్కొన్నారు. ఆదివారం పట్టణంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో బీసీలకు 43% రిజర్వేషన్ అమలు చేయడంలో బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. బీజేపీ రాజ్యాంగ రద్దు కోసం కుట్ర చేస్తోందన్నారు. నాయకులు రవీంద్ర, జంగుబాపు, రమేశ్, జగన్మోహన్, తుకారాం తదితరులు ఉన్నారు.