News September 24, 2025
ఆదిలాబాద్: మమ్మల్ని అనాథలను చేయకండి..!

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కుటుంబ కలహాలు కలకలం సృష్టిస్తున్నాయి. గొడవలతో వివాహితులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. సోమవారం కాగజ్నగర్లో ఓ వివాహిత తన కుమార్తెతో కలిసి సూసైడ్ చేసుకోగా.. ఇటీవల జైనథ్ మండలానికి చెందిన మరో వివాహిత బలవర్మరణానికి పాల్పడింది. ఇలాంటి ఘటనలతో పిల్లలు తమ తల్లిదండ్రులకు దూరమై అనాథలుగా మారుతున్నారు. తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించండి. అఘాయిత్యాలకు పాల్పడకండి.
Similar News
News September 24, 2025
మరో అల్పపీడనం.. భారీ వర్షాలు

AP: రేపు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని APSDMA తెలిపింది. దీని ప్రభావంతో ఆదివారం వరకు పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరిలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఐదు రోజుల పాటు రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తగా ఉండాలని, మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని సూచించింది.
News September 24, 2025
గాజువాక: డాక్యార్డ్ వంతెన రెఢీ

గాజువాక పారిశ్రామిక ప్రాంత వాసుల రవాణా కష్టాలు తీరనున్నాయి. డాక్యార్డ్ వద్ద సర్దార్ వల్లభాయ్ పటేల్ వంతెన నిర్మాణం పూర్తయ్యింది. పోర్ట్ యాజమాన్యం మద్రాస్ ఐఐటి ఇంజనీర్ల బృందంతో రూ.26 కోట్లతో 330 మీ.పొడవు.10.5మీ.వెడల్పు 20 నెలల్లో వంతెన పునర్నిర్మాణం పూర్తిచేశారు. దసరా నుంచి రాకపోకలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అలా అయితే ప్రయాణికులకు సమయంతోపాటు ఖర్చూ తగ్గుతుంది.
News September 24, 2025
MDK: డిజి’డల్’.. సర్వే

మెదక్ జిల్లాలో వానాకాలం పంటల వివరాల నమోదు ప్రక్రియ అంతమాత్రంగానే ఉంది. ఓవైపు ధాన్యం సేకరణకు పౌరసరఫరాలశాఖ సన్నాహాలు చేస్తుండగా.. మరోవైపు వ్యవసాయశాఖ అధికారులు పంటల నమోదు కొనసాగిస్తున్నారు. ఈ సీజన్లో జిల్లావ్యాప్తంగా 3.45 లక్షల ఎకరాల విస్తీర్ణంలో పలు రకాల పంటలు సాగుచేశారు. పంటల సీజన్ పూర్తవుతున్నా ఇప్పటి వరకు కేవలం 25 శాతం మాత్రమే డిజిటల్ క్రాప్ సర్వే అయినట్లు వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు.