News December 6, 2025
ఆదిలాబాద్: మహిళల్లో ఆత్మవిశ్వాసం పెరగాలి: కలెక్టర్

ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ధైర్యంగా ఎదుర్కొనే ఆత్మవిశ్వాసం మహిళల్లో పెరగాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మహిళలపై హింసకు వ్యతిరేకంగా అంతర్జాతీయ ప్రచారోద్యమం నేపథ్యంలో, ఆదిలాబాద్లోని న్యూ అంబేద్కర్ భవన్లో సఖి కేంద్రం, జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. మహిళలపై హింస నిర్మూలనకు సమాజమంతా ముందుకు రావాల్సిన అవసరం ఉందని కలెక్టర్ పేర్కొన్నారు.
Similar News
News February 2, 2026
ఆదిలాబాద్: ఘరానా మోసగాడు ARREST

ఆదిలాబాద్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో Cheazi Logistics Pvt. Ltd పేరుతో ఫ్రాంచైజీలు ఇస్తానని నమ్మించి పలువురిని మోసం చేసిన చిత్తూరి శేఖర్ను అరెస్ట్ చేశామని టూ టౌన్ ఇన్స్పెక్టర్ కె.నాగరాజు తెలిపారు. 2 రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాలకు చెందిన 15 మంది బాధితుల నుంచి రూ.40 లక్షలకు పైగా వసూలు చేసినట్లు విచారణలో వెల్లడైందన్నారు. నిందితుడిని రిమాండ్కు తరలించామని, కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.
News February 2, 2026
ఆదిలాబాద్: ప్రాక్టికల్ పరీక్ష కేంద్రం తనిఖీ

ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు సోమవారం ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షల కోసం జిల్లాలో 16పరీక్ష కేంద్రాలను చేసి విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలను కల్పించారు. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో జరిగిన పరీక్షల ప్రశాంతంగా ముగిశాయని జిల్లా ఇంటర్ బోర్డు అధికారి జాదవ్ గణేశ్ కుమార్ తెలిపారు. పలు కేంద్రాలను DIEO, ఇద్దరు జిల్లా పరీక్షల కమిటీ మెంబర్లను, ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీ చేశారు.
News February 2, 2026
ఆదిలాబాద్: ‘ఛైర్మన్ ఎన్నికకు నోటీసులు జారీ చేసే ఆప్షన్ తీసుకోవాలి’

మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం పరోక్ష విధానంలో నిర్వహించే మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక విషయంలో ఎక్స్ అఫిషియోల మున్సిపాలిటీ ఎంపిక కోసం నోటీసులు జారీ చేసే ఆప్షన్ తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని సూచించారు. సోమవారం జిల్లా కలెక్టర్ రాజర్షి షా, అదనపు కలెక్టర్లతో మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి దిశా నిర్దేశం చేశారు.


