News May 10, 2024

ఆదిలాబాద్ : మీరు ఓటేశారా..? నేడే LAST మరీ..!

image

ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పోలీసులు, పాత్రికేయులకు కేంద్ర ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ ద్వారా కల్పించిన ఓటింగ్ సదుపాయం నేటితో ముగియనుందని అధికారులు తెలిపారు. ఈనెల 3నుంచి 8వరకు అవకాశం ఇవ్వగా మరో 2 రోజులు పోస్టల్ బ్యాలెట్ గడువును పొడిగించారు. రెండు రోజులు గడువు పొడిగించడంతో ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

Similar News

News November 4, 2025

ఆదిలాబాద్‌లో నేటి పత్తి ధర వివరాలు

image

ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. మార్కెట్‌లో మంగళవారం సీసీఐ పత్తి ధర క్వింటా రూ.8,110గా, ప్రైవేట్ పత్తి ధర రూ.6,900గా నిర్ణయించారు. సోమవారం ధరతో పోలిస్తే మంగళవారం సీసీఐ ధరలో ఎలాంటి మార్పు లేదు. ప్రైవేటు ధరలో సైతం ఎటువంటి మార్పు లేదని వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు తెలిపారు.

News November 4, 2025

ADB: బీసీ నేతను పరామర్శించిన కవిత

image

తలమడుగు మండల బీసీ సంఘం అధ్యక్షుడు మేకల రవికాంత్ యాదవ్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పరామర్శించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

News November 4, 2025

భీంపూర్ మండలంలో పులి సంచారం కలకలం..!

image

గత కొన్ని రోజులుగా భీంపూర్ మండలంలో పులి సంచారం కలకలం రేపుతోంది. తాజాగా సోమవారం అంతర్గాం గ్రామస్థుల వ్యవసాయ పొలాల్లో పులి అడుగులు కనిపించాయని రైతులు తెలిపారు. దీంతో సమీప గ్రామాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి అటవీ అధికారులు వివరాలు వెల్లడించాల్సి ఉంది.