News November 20, 2025
ఆదిలాబాద్: యువతి సూసైడ్

ఆదిలాబాద్ అశోక్ రోడ్డుకు చెందిన స్రవంతి బుధవారం రాత్రి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఇంట్లోనే బలవన్మరణానికి పాల్పడింది. సమాచారం అందుకున్న డయల్-100 సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై వన్ టౌన్ ఇన్స్పెక్టర్ సునీల్కుమార్ వివరణ కోరగా, యువతి ఆత్మహత్య చేసుకున్నట్లు ధ్రువీకరించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 20, 2025
MHBD: వృద్ధురాలి దారుణ హత్య.. UPDATE

MHBD(D) రామన్నగూడెంలో నిన్న <<18334484>>వృద్ధురాలు హత్యకు<<>> గురైన విషయం తెలిసిందే. స్థానికులు, పోలీసుల ప్రకారం.. కురవి(M)కి చెందిన పద్మ భర్త మృతి చెందడంతో 2వ కూతురి ఇంట్లో ఉంటోంది. కూతురు, అల్లుడు HYDలో ఉంటుండగా ఒంటరిగా ఉంటోంది. ఉదయం నుంచి పద్మ బయటికి రాకపోవడంతో స్థానికులు వెళ్లి చూడగా రక్తపు గాయాలతో పడి ఉంది. SI రమేశ్ బాబు కేసు నమోదు చేశారు. బంగారం కోసమా? అత్యాచారంచేసి హత్య చేశారా? అనేది దర్యాప్తులో తేలనుంది.
News November 20, 2025
విశాఖ: ‘2025-26 సంవత్సరానికి కాఫీ కొనుగోలు ధరల ప్రకటన’

2025-26 సంవత్సరానికి కాఫీ కొనుగోలు ధరలను విశాఖలో జరిగిన సమవేశంలో అపెక్స్ కమిటీ ప్రతినిధులు ప్రకటించారు. అరెబికా పార్చ్మెంట్ రకం (KG) రూ.450, అరెబికా చెర్రీ రూ.270, రోబస్టా చెర్రీ కాఫీ రూ.170 చొప్పున నిర్ణయించారు. గిరిజన కాఫీ రైతుల సంక్షేమం కోసం ధరలను పెంచామన్నారు. ఈ విషయాన్ని పాడేరు ఏజెన్సీలోని గిరిజన కాఫీ రైతులందరికీ విస్తృత అవగాహన కల్పించాలని GCC సిబ్బందిని అధికారులు ఆదేశించారు.
News November 20, 2025
ముప్కాల్: రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

తూప్రాన్ పట్టణ పరిధి కరీంగూడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై శివానందం తెలిపారు. ముప్కాల్ గ్రామానికి చెందిన పన్నీర్ వెంకటేష్(24) ప్రేమ వివాహం చేసుకొని హైదరాబాద్లో నివాసం ఉంటున్నాడు. ఈ నెల 16న ఆర్మూర్ నుంచి హైదరాబాద్ వెళుతుండగా ద్విచక్ర వాహనం అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై చెప్పారు.


