News December 21, 2025
ఆదిలాబాద్: సోమవారం ప్రజావాణి యథాతథం

ఈ సోమవారం (22 వ తేదీ) నుంచి ప్రజావాణి కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. గ్రామపంచాయతీ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్నందున ఇన్ని రోజులు వాయిదా పడిన ప్రజావాణి కార్యక్రమం సోమవారం నుంచి తిరిగి ప్రారంభమవుతుందన్నారు. ప్రజలు ఎవరైనా తమ సమస్యల గురించి దరఖాస్తులు ఇవ్వదలుచుకుంటే ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.
Similar News
News December 20, 2025
బ్లాక్ మెయింగ్కి పాల్పడితే సంప్రదించండి: ADB SP

మహిళలకు గతంలో జరిగిన వాటిని అడ్డుగా పెట్టుకుని బ్లాక్మెయిలింగ్ పాల్పడుతున్న సందర్భాలలో నిర్భయంగా షీ టీం బృందాన్ని సంప్రదించవచ్చని SP అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. గతంలో ప్రేమించి, ప్రస్తుతం ఆ యువకులచే వేధింపబడుతున్న మహిళలు నిర్భయంగా సంప్రదించాలని సూచించారు. షీ టీం అండగా ఉంటూ సహాయాన్ని అందజేస్తుందని హామీ ఇచ్చారు. ఆపద వస్తే 8712659953 నంబర్కు సంప్రదించాలన్నారు.
News December 20, 2025
నెరడిగొండ: 21 ఏళ్లకే ఉప సర్పంచ్గా..

పంచాయతీ ఎన్నికల్లో భాగంగా నెరడిగొండ మండలం బుద్దికొండకు చెందిన 21 ఏళ్ల యువకుడు సాబ్లే రతన్ సింగ్ను గ్రామ ఉపసర్పంచ్గా ఎన్నుకున్నారు. అతి పిన్న వయసులోనే బాధ్యతలు చేపట్టి రతన్ సింగ్ రికార్డు సృష్టించారు. తనపై నమ్మకంతో గెలిపించిన గ్రామస్తులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. యువత తలచుకుంటే ఏదైనా సాధ్యమని, గ్రామ అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేసి ప్రజల నమ్మకాన్ని నిలబెడతానని ధీమా వ్యక్తం చేశారు.
News December 20, 2025
గ్రామ పంచాయతీల అభివృద్ధి మీ బాధ్యతే: కలెక్టర్

గ్రామ పంచాయతీల అభివృద్ధి బాధ్యత నూతన సర్పంచులదేనని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. నార్నూర్ పంచాయతీ సర్పంచిగా తన కూతురు బాణోత్ కావేరి గెలుపొందడంతో సర్పంచుల సంఘం రాష్ట్ర మాజీ కార్యదర్శి గజానంద్ నాయక్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావుతో కలిసి శుక్రవారం కలెక్టర్ను శాలువాతో సత్కరించారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలు చేసిన నీతి అయోగ్ కార్యక్రమానికి నార్నూర్ మండలం ఎంపిక కావడం గొప్ప విషయమన్నారు.


