News September 28, 2024
ఆదిలాబాద్: DEGREE విద్యార్థులకు గమనిక
కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించాలని ఆదిలాబాద్ ఆర్ట్స్ అండ్ కామర్స్ కళాశాల ప్రిన్సిపాల్ అతిక్ బేగం పేర్కొన్నారు. అక్టోబర్ 5 వరకు అవకాశం ఉందని తెలిపారు. ఆలస్య రుసుముతో అక్టోబర్ 15 వరకు అవకాశం ఇచ్చారని తెలిపారు. కాగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని డిగ్రీ విద్యార్థులు ఈ విషయాన్ని గమనించి.. ఫీజు చెల్లించండి.
>>SHARE IT
Similar News
News September 29, 2024
ఆసిఫాబాద్: ‘రాజీ మార్గమే రాజా మార్గం’
రాజీ మార్గమే రాజా మార్గమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంవి.రమేష్ అన్నారు. శనివారం ఆసిఫాబాద్ పట్టణంలోని కోర్టు ఆవరణలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలతో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లోక్ అదాలత్ ద్వారా కేసులను రాజీమార్గం ద్వారా పరిష్కరించుకోవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా కేసులను అక్కడికక్కడే పరిష్కరించినట్లు ఆయన తెలిపారు.
News September 28, 2024
ఆదిలాబాద్లో లోక్ అదాలత్కు భారీ స్పందన
జాతీయ లోక్ అదాలత్ కు భారీ స్పందన వచ్చిందని జిల్లా ఎస్పీ గౌష్ ఆలం తెలిపారు. అదిలాబాద్, ఉట్నూర్, బోథ్ అదిలాబాద్ న్యాయస్థానాల్లో వివిధ స్థాయిలో పెండింగ్లో ఉన్న 954 పోలీస్ కేసులు పరిష్కరించబడ్డాయన్నారు. రూ.12 లక్షల పైచిలుకు జరిమానా వసూలు చేసినట్లు పేర్కొన్నారు. 287 ఎఫ్ఐఆర్, 665 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల పరిష్కారం అయిందన్నారు. 18 సైబర్ క్రైమ్ కేసులలో బాధితులకు రూ.3,71,175/- తిరిగి అందించామన్నారు.
News September 28, 2024
MNCL: వ్యభిచార గృహంపై పోలీసుల దాడి
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సాయికుంట సంతోష్ నగర్ కాలనీలోని ఓ ఇంట్లో రహస్యంగా నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై శనివారం టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. తమకు అందిన సమాచారంతో వ్యభిచారం నిర్వహిస్తున్న తోట మహేందర్, ఓ మహిళ, విటుడు బోలెం శ్రీకాంత్ను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్లో అప్పగించారు.