News October 1, 2024
ఆదిలాబాద్: DSCతో భర్తీ కానున్న పోస్టులు
ఆదిలాబాద్ జిల్లాలో DSCతో పోస్టులు భర్తీ కానున్నాయి. మొత్తం 324 పోస్టుల్లో 74 స్కూల్ అసిస్టెంటు, 14 లాంగ్వేజ్ పండితులు, రెండు పీఈటీలు భర్తీ కానుండగా అత్యధికంగా 209 సెకండరీ గ్రేడ్ టీచర్(ఎస్జీటీ) పోస్టులు భర్తీ కానున్నాయి. ఈ సారి కొత్తగా ప్రత్యేకావసర పిల్లల బోధనకు స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను నోటిఫై చేశారు. ఇందులో ఆరు స్కూల్అసిస్టెంటు, 19 ఎస్జీటీ పోస్టులు భర్తీ చేయనున్నారు.
Similar News
News October 1, 2024
నిర్మల్: సడలని సంకల్పం.. అప్పుడు సర్పంచ్ ఇప్పుడు టీచర్..!
చదువుకు వయసుతో నిమిత్తం లేదని నిరూపించాడు. రాజకీయంలో జిల్లాస్థాయిలో తనదైన ముద్ర వేసుకొని ఇప్పుడు డీఎస్సీలో మంచి ర్యాంకు సాధించి మన్ననలు పొందుతున్నాడు. TUలో బీఈడీ పూర్తిచేసిన నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మాజీ సర్పంచ్(2013)నంద అనిల్ నిన్న విడుదలైన డీఎస్సీ ఫలితాల్లో జిల్లా స్థాయిలో 7వ ర్యాంకు సాధించి, సాంఘిక శాస్త్రం విభాగంలో స్కూల్ అసిస్టెంట్గా ఎంపికయ్యాడు. ఆయనను పలువురు అభినందించారు.
News October 1, 2024
ఆదిలాబాద్: వ్యభిచార గృహంపై పోలీసుల దాడి
ఆదిలాబాద్ రాంనగర్లో దంపతులు అద్దె ఇంట్లో వ్యభిచార గృహం నడిపిస్తున్నట్లు ఎస్ఐ విష్ణు తెలిపారు. మరో మహిళ ఆ గృహానికి అమ్మాయిలను మభ్యపెట్టి తీసుకెళ్లి వేశ్య వృత్తిలోకి దింపుతోందన్నారు. సోమవారం ఇంట్లో దాడి చేయగా వ్యభిచార గృహం నిర్వాహకులు, అమ్మాయిలను సరఫరా చేసే మహిళ, ముగ్గురు విటులు, బాధితులను గుర్తించి నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.
News October 1, 2024
ADB: డీఎస్సీ ఫలితాల్లో 1వ ర్యాంకు సాధించిన పూర్ణచందర్ రెడ్డి
తెలంగాణ డీఎస్సీ 2024 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలలో అదిలాబాద్ జిల్లా బోథ్ మండలం సోనాల గ్రామానికి చెందిన నీగ పూర్ణ చందర్ రెడ్డి జిల్లాలోనే మెుదటి ర్యాంకు సాధించాడు. దీంతో ఆయన తల్లిదండ్రులతో పాటు ప్రోత్సహించి గ్రామస్థులు అభినందించారు. మండలానికి చెంది ఉపాధ్యాయులు ఆయనను ఘనంగా సన్మానించారు.