News July 30, 2024

ఆదిలాబాద్: KGBV నాన్ టీచింగ్ పోస్టులకు దరఖాస్తులు

image

ఆదిలాబాద్ జిల్లాలోని కేజీబీవీలు, నాన్ టీచింగ్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు DEO ప్రణీత/ఎక్స్ అఫిషియో ప్రాజెక్టు అధికారి పేర్కొన్నారు. మొత్తం 13 పోస్టులకు జులై 30 నుంచి ఆగస్టు 1 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. అర్హత కలిగిన వారు పోస్టులకు సంబంధిత MEO కార్యాలయాల్లో  దరఖాస్తులు సమర్పించాలన్నారు. 18 నుంచి 35 సంవత్సరాల వయస్సు గల మహిళలు అర్హులని తెలిపారు.

Similar News

News November 12, 2025

ADB: కౌలు రైతులు వెంటనే పంట నమోదు చేసుకోవాలి

image

ఆదిలాబాద్ జిల్లాలోని కౌలు రైతులు అలాగే డిజిటల్ సంతకం లేని భూములు, పీపీ భూములు, పార్ట్–3 భూములు కలిగిన రైతులు వెంటనే పంట నమోదు చేసుకోవాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. కనీస మద్దతు ధరకు తమ పంటను విక్రయించే అవకాశాన్ని కోల్పోకుండా ఈ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. కౌలు రైతులు తమ పంటను సీసీఐ కేంద్రాల్లో అమ్మకానికి నమోదు చేసుకోవాలంటే ఏఈఓ వద్ద వివరాలు నమోదు చేసుకోవాలని వివరించారు.

News November 12, 2025

ఉట్నూర్: తండ్రిని చంపిన కొడుకుకి 7ఏళ్ల జైలు శిక్ష

image

ఉట్నూర్ మండలం రాజన్న గూడకు చెందిన గడ్డం భగవాన్ 2024 సెప్టెంబర్ 13న మద్యం మత్తులో తండ్రిని చంపాడు. డబ్బుల కోసం తలపై దాడిచేయడంతో చికిత్స పొందుతూ అతడి తండ్రి మృతి చెందాడు. కేసు నమోదు చేసిన ఉట్నూర్ పోలీసులు నిందితుడిని కోర్టులో హాజరుపర్చగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు అతడికి 7ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.1000 జరిమానా విధించారు.

News November 12, 2025

ఆదిలాబాద్‌లో నేటి పత్తి ధర వివరాలు

image

ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. మార్కెట్‌లో బుధవారం సీసీఐ పత్తి ధర క్వింటాలు రూ.8,110గా, ప్రైవేట్ పత్తి ధర రూ.6,750గా నిర్ణయించారు. మంగళవారం ధరతో పోలిస్తే బుధవారం సీసీఐ ధరలో మార్పు లేదని అధికారులు తెలియజేశారు. ప్రైవేటు ధరల్లో సైతం ఎలాంటి మార్పు లేదని వెల్లడించారు.