News April 19, 2024
ఆదిలాబాద్: Way2News కథనానికి అధికారుల స్పందన
Way2News కథనానికి మున్సిపల్ అధికారులు స్పందించారు. ఈనెల 17న ఆదిలాబాద్ సుభాష్ నగర్ కాలనీలో “మురికి కాలువ శుభ్రం చేసుకుంటున్న యజమానులు” అనే శీర్షికతో వార్త ప్రచురితమయ్యింది. దీంతో మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి పారిశుద్ధ్య కార్మికులతో నాళాలను శుభ్రం చేయించారు. అలగే మున్సిపల్ సానిటరీ ఇన్స్పెక్టర్ నరేందర్ సైతం నాళాలు తీసిన కుటుంబీకులతో మాట్లాడి ఏమైనా సమస్య ఉంటే తనను సంప్రదించాలన్నారు.
Similar News
News September 30, 2024
ఆదిలాబాద్: కాసేపట్లో DSC రిజల్ట్స్.. అభ్యర్థులు వీరే!
DSC ఫలితాలు కాసేపట్లో విడుదల కానున్నాయి. ఉమ్మడి జిల్లాలో STG పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి. ADBలో 148 పోస్టులకు 4514 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా పోటీ 1:30గా ఉంది. ASFలో 190 పోస్టులకు 2710 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా పోటీ 1:14గా ఉంది. MNCLలో 165 పోస్టులకు 2527 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా పోటీ 1:15గా ఉంది. NRMLలో 175 పోస్టులకు 2372 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా పోటీ 1:13గా ఉంది.
News September 30, 2024
జన్నారం: నేడు పట్టు పరిశ్రమపై రైతులకు అవగాహన
జన్నారం మండలంలోని అన్ని గ్రామాల రైతులకు పట్టు పరిశ్రమ/పట్టుపురుగుల పెంపకంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారని మండల వ్యవసాయ అధికారులు తెలిపారు. సోమవారం ఉ.10 గంటలకు జన్నారం పట్టణంలోని పొన్కల్ రైతు వేదికలో అవగాహన కార్యక్రమం ఉంటుందన్నారు. పట్టు పరిశ్రమ సహాయ సంచాలకులు వస్తున్నారని వారు వెల్లడించారు. జన్నారం మండలంలోని అన్ని గ్రామాల రైతులు కూడా సకాలంలో రావాలని వారు సూచించారు.
News September 30, 2024
కడెం ప్రాజెక్టు UPDATE
ఎగువ నుంచి వస్తున్న వరదతో కడెం ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. కడెం ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 700 అడుగులు కాగా, సోమవారం ఉదయం ప్రాజెక్టు నీటిమట్టం 700 అడుగులకు చేరుకుందని అధికారులు తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి 902 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. కుడి, ఎడమ కాల్వలకు 806, మిషన్ భగీరథకు 9 మొత్తం కలిపి 902 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని ఆ ప్రాజెక్ట్ అధికారులు వివరించారు.