News May 25, 2024

ఆదోనిలో రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య

image

ఆదోని రైల్వే స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి శనివారం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మృతుడు శెట్టి బలిజ హరిప్రసాద్(30)గా గుర్తించామని తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.

Similar News

News October 11, 2024

నంద్యాల వైద్యుడిని బెదిరించి ₹38 లక్షలు కాజేశారు!

image

తాము CBI ఆఫీసర్లమంటూ సైబర నేరగాళ్లు నంద్యాల వైద్యుడిని మోసం చేశారు. పద్మావతినగర్‌లోని రాహుల్ ఆసుపత్రి అధినేత డా.రామయ్యకు సీబీఐ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నామంటూ నేరగాళ్లు ఫోన్ చేశారు. మీపై కేసులున్నాయి.. అరెస్ట్ చేస్తామని బెదిరించి డబ్బులు డిమాండ్ చేశారు. ఆందోళనకు గురైన వైద్యుడు ₹38 లక్షలకు వారి ఖాతాకు ట్రాన్స్‌ఫర్ చేశారు. తర్వాత మేల్కొన్న వైద్యుడు మోసగాళ్లని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

News October 11, 2024

శ్రీశైల క్షేత్రంలో నేటి పూజా కార్యక్రమాలు!

image

◆ దసరా మహోత్సవాలలో భాగంగా 9వ రోజైన నేడు అమ్మవారికి సిద్దిదాయిని అలంకారం
◆ స్వామి, అమ్మవార్లకు అశ్వవాహన సేవ
◆ పురవీధుల్లో గ్రామోత్సవం
◆ ఉత్సవాల సందర్భంగా శ్రీస్వామి అమ్మవార్లకు విశేషపూజలు, వాహనసేవలు, అమ్మవారికి నవదుర్గ అలంకరణలు
◆ లోక కల్యాణం కోసం జపాలు, పారాయణలు, రుద్రయాగం, చండీయాగం
◆ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ తరఫున స్వామి, అమ్మవార్లకు పట్టు వస్త్రాల సమర్పణ

News October 11, 2024

కర్నూలు: బైక్ ప్రమాదంలో యువకుడి మృతి

image

కర్నూలు జిల్లాలో బైక్ అదుపుతప్పి యువకుడు మృతిచెందిన ఘటన జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. కోసిగి గ్రామానికి చెందిన తిమ్మయ్య, లక్ష్మీ దంపతుల కుమారుడు ఆంజనేయులు(17) సిద్ధరుఢా మఠం దగ్గర నివాసం ఉంటున్నారు. గురువారం సాయంకాలం ఉరుకుందు రోడ్డు సమీపంలో ద్విచక్ర వాహనంపై బహిర్భూమికి వెళ్తుండగా బైక్ అదుపుతప్పి గాయపడ్డాడు. తీవ్ర గాయాలు కావడంతో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.