News October 21, 2025

ఆదోనిలో MPTCల కిడ్నాప్ కలకలం

image

ఆదోనిలో MPTC కిడ్నాప్ వ్యవహారం కలకలం రేపింది. బైచిగేరి MPTC నాగభూషణ్ రెడ్డిని కిడ్నాప్ చేశారంటూ ఆయన భార్య విజయలక్ష్మి తాలూకా పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశారు. MPPపై అవిశ్వాస తీర్మానానికి వైసీపీ MPTCలు సిద్ధమైన విషయం తెలిసిందే. ఈనెల 22న జరిగే అవిశ్వాస తీర్మానానికి వెళ్లకుండా తన భర్తను కిడ్నాప్ చేశారని ఆమె ఆరోపించారు. ఈయనతో పాటు మరో ముగ్గురు MPTCలను సైతం కిడ్నాప్ చేసినట్లు సమాచారం.

Similar News

News October 22, 2025

NZB: రియాజ్ కేసు విచారణలో ఉంది: డీజీపీ

image

నిజామాబాద్‌లో రియాజ్ కేసు విచారణలో ఉందని, పూర్తి వివరాలు వెల్లడించలేమని రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. మంగళవారం పోలీస్ కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రియాజ్‌ను పట్టుకోవడంలో పోలీసులకు సహకరించి గాయపడ్డ ఆసీఫ్‌ కుటుంబానికి రూ.50 వేలు రివార్డు అందించామన్నారు. రాష్ట్రంలో 65 మంది మావోయిస్టులు అజ్ఞాతంలో ఉన్నారని తెలిపారు.

News October 22, 2025

అక్టోబర్ 22: చరిత్రలో ఈరోజు

image

1901: ఆదివాసీ పోరాట యోధుడు కొమురం భీం జయంతి
1998: బాలీవుడ్ నటుడు అజిత్ ఖాన్ మరణం
2001: సినీ నటుడు రామకృష్ణ మరణం
2008: చంద్రుడి పైకి మానవరహిత చంద్రయాన్-1ను ప్రయోగించిన ఇస్రో
➣అంతర్జాతీయ నత్తి నివారణ అవగాహన దినోత్సవం

News October 22, 2025

REWIND 2023 పోల్.. జూబ్లీహిల్స్‌లో ఎవరికెన్ని ఓట్లు వచ్చాయంటే?

image

2023 డిసెంబర్‌లో జరిగిన సాధారణ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గ నుంచి 19 మంది అభ్యర్థులు పోటీ చేశారు. BRS నుంచి పోటీ చేసి మాగంటి గోపీనాథ్ 80,549 ఓట్లు సాధించి విజయం సాధించారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ 64,212 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. బీజేపీ తరఫున లంకల దీపక్ రెడ్డి 25,866 ఓట్లు సాధించగా ఎంఐఎం అభ్యర్థి రషీద్ ఫరాజుద్దీన్ 7,848 ఓట్లు పొందారు.