News March 26, 2025
ఆదోని అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్

ఆదోని అడ్వకేట్ బార్ అసోసియేషన్ ఎలక్షన్కు రంగం సిద్ధం చేశారు. ఎలక్షన్ ఆఫీసర్స్గా విజయ భాస్కర్ రెడ్డి, సోమశేఖర్, హనుమేశ్ను ఎన్నుకున్నారు. న్యాయవాదుల మధ్య రెండు ప్యానల్స్ నుంచి నామినేషన్ వేశారని, ప్రెసిడెంట్గా శ్రీరాములు, మధుసూదన్ రెడ్డి మధ్య.. వైస్ ప్రెసిడెంట్గా జే.వెంకటేశ్వర్లు, లోకేశ్ కుమార్ మధ్య పోటీ ఉండగా.. మరి కొంతమంది నామినేషన్ దాఖలు చేశారని ఎలక్షన్ ఆఫీసర్లు తెలిపారు.
Similar News
News March 29, 2025
తాగునీటి సమస్య లేకుండా తగిన చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

జిల్లాలో తాగునీటి సమస్య లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని, అన్ని గ్రామాలు తిరిగి, తాగునీటి సమస్యలు ఉన్న చోట వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పీ.రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. శనివారం తాగునీటి సమస్యల పరిష్కారం, ఉపాధి హామీ పనుల పురోగతిపై అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రెండు రోజుల్లో తాగునీటి సమస్య పరిష్కారంపై నివేదికను పంపించాలి అధికారులను ఆదేశించారు.
News March 29, 2025
వొకేషనల్ పరీక్షకు 117 మంది గైర్హాజరు: డీఈవో

పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో భాగంగా శనివారం జరిగిన వొకేషనల్ సబ్జెక్టులో 117 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాలేదని జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ వెల్లడించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా జరిగిన పరీక్షల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని అన్నారు. పరీక్షలు పకడ్బందీగా, విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా నిర్వహించామన్నారు.
News March 29, 2025
ఊపిరి ఉన్నంత వరకు టీడీపీలోనే: కర్నూలు ఎంపీ

తన లాంటి సామాన్యుడిని ఎంపీని చేసిన ఘనత తెలుగుదేశం పార్టీదని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు తెలిపారు. శనివారం కర్నూలులో జరిగిన టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. ఊపిరి ఉన్నంత వరకు తాను టీడీపీలోనే ఉంటానని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తూ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ పాలన సాగిస్తున్నారని చెప్పారు. టీడీపీ పేదల పార్టీ అని తెలిపారు.