News March 12, 2025
ఆదోని విషాద ఘటన.. మృతులు వీరే!

ఆదోని మండలం పాండవగల్లు గ్రామం వద్ద పెను విషాద ఘటన జరిగిన విషయం తెలిసిందే. ముందువెళ్తున్న రెండు బైక్లను కర్ణాటక బస్సు ఢీకొనడంతో ఐదుగురు మృతి చెందారు. మృతుల్లో కుప్పగల్లు గ్రామానికి చెందిన దంపతులు కురువ పూజారి ఈరన్న (25), పూజారి ఆదిలక్ష్మి (23), కర్ణాటకకు చెందిన భార్యాభర్తలు హేమాద్రి (40), నాగరత్న (35)తో పాటు వారి కుమారుడు దేవరాజు (20) ఉన్నారు. ఈ ఘటనతో ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
Similar News
News November 12, 2025
15న తిరుపతిలో జాబ్ మేళా

తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ కార్యాలయం మోడల్ కెరీర్ సెంటర్(MCC)లో 15వ తేదీ జాబ్ మేళా నిర్వహించనున్నారు. 3కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని కార్యాలయ అధికారి శ్రీనివాసులు చెప్పారు. పదో తరగతి, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, ఏదైనా డిగ్రీ, MBA పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. దాదాపు 1000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని.. ఆ రోజు ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూలకు రావలని కోరారు.
News November 12, 2025
వనపర్తి: ‘రెవెన్యూ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి’

రెవెన్యూ సదస్సు ద్వారా వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ కీమ్యా నాయక్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఆయన సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ సదస్సు ద్వారా 41,100 దరఖాస్తులు వచ్చాయని, ఇందులో 30,672 ఎకరాల కవరేజీ ఉందని తెలిపారు. ఇప్పటివరకు 5,863 ఎకరాలు అప్డేట్ చేసినట్లు చెప్పారు.
News November 12, 2025
జగిత్యాల: కొనుగోలు ధాన్యం మిల్లులకు తరలించాలి: కలెక్టర్

కొనుగోలు చేసిన ధాన్యాన్ని తక్షణమే రైస్ మిల్లులకు తరలించాలని కలెక్టర్ బి.సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఆయన కొడిమ్యాల మండలంలోని పూడూరు, నాచుపల్లి, డబ్బు తిమ్మయ్యపల్లి కేంద్రాలను పరిశీలించారు. నాణ్యతతో ధాన్యం కొనుగోలు చేసి, రైతులకు 48 గంటల్లో చెల్లింపులు జరపాలని సూచించారు. తేమ 17% వచ్చేవరకు ఆరబెట్టి కేంద్రాలకు తేవలని రైతులకు విజ్ఞప్తి చేశారు.


