News December 30, 2025

ఆదోని-1, 2: ఏ మండలంలో ఏ గ్రామాలు!

image

ఆదోనిని ప్రభుత్వం 2 మండలాలుగా విభజించింది. ఆదోని-1, 2 మండలాలు ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
★ ఆదోని మండలం-1లోని గ్రామాలు:
☞ ఆదోని, మండిగిరి, S.కొండాపురం, కల్లుబావి, వెంగళాపురం, పర్వతాపురం, ఇస్వీ, గోనబావి, సలకలకొండ, విరుపాపురం, దొడ్డనగేరి, సాంబగల్లు, దిబ్బనకల్లు, పెసలబండ, నెట్టేకల్లు, అరేకల్లు, బైచిగేరి, వువ్వనూరు, మాంత్రికి, దెయ్యాలగూడెం, కపటి, బసరకోడు, చిన్నపెండేకల్లు, సుల్తానపురం. <<18709003>>cont..<<>>

Similar News

News January 1, 2026

40’s తర్వాత నిద్ర తగ్గితే ఏం జరుగుతుందో తెలుసా?

image

40 ఏళ్ల తర్వాత శరీరానికి 7-9 గంటల నిద్ర అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. 7గంటల కంటే తక్కువ సమయం నిద్రపోతే టైప్-2 డయాబెటిస్, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. మెదడు ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. బెల్లీ ఫ్యాట్ పెరుగుతుంది. రోగనిరోధక శక్తి తగ్గుదలతోపాటు రోజువారీ కార్యకలాపాలకు బాడీ నెమ్మదిగా స్పందిస్తుంది. విటమిన్ డెఫిషియన్సీ, ప్రీ డయాబెటిస్, థైరాయిడ్, హార్మోన్ల అసమతుల్యత సమస్యలు వచ్చే ప్రమాదముంది.

News January 1, 2026

IASలతో CM రేవంత్ సెలబ్రేషన్స్

image

TG: బేగంపేటలోని IAS ఆఫీసర్స్ అసోసియేషన్ క్లబ్‌లో నిర్వహించిన న్యూఇయర్ వేడుకల్లో CM రేవంత్ పాల్గొన్నారు. IASలు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర ప్రజలకు CM రేవంత్ కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ‘తెలంగాణ రైజింగ్ విజన్​ 2047 లక్ష్య సాధన దిశగా ఈ ఏడాదిలో రాష్ట్ర ప్రభుత్వం మరింత ముందుకు సాగుతుంది. అందరి ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేందుకు ప్రాధాన్యమిస్తాం’ అని తెలిపారు.

News January 1, 2026

పండుగలా పాస్‌ పుస్తకాల పంపిణీ చేపట్టాలి: జేసీ

image

జిల్లాలో రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్‌ పుస్తకాల పంపిణీని పండుగ వాతావరణంలో చేపట్టాలని జేసీ టి.రాహుల్‌ కుమార్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం భీమవరంలో ఆర్డీవోలు, తహశీల్దార్లతో నిర్వహించిన గూగుల్‌ మీట్‌లో ఆయన మాట్లాడారు. జనవరి 2 నుంచి 9 వరకు ఈ పంపిణీ కార్యక్రమం నిర్వహించాలని, రెవెన్యూ క్లినిక్‌ల పనితీరుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.