News January 29, 2026
ఆనందం డబుల్.. గ్రూప్-2 కొట్టిన భార్యాభర్తలు

AP: తాజా గ్రూప్-2 <<18979288>>ఫలితాల్లో<<>> అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన భార్యాభర్తలు సత్తా చాటారు. భార్య వినీత సబ్ రిజిస్ట్రార్గా, భర్త హేమచంద్ర ఎక్సైజ్ ఇన్స్పెక్టర్గా ఎంపికయ్యారు. HYDలో సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్న సమయంలో నోటిఫికేషన్ రావడంతో ఉద్యోగాలకు రాజీనామా చేసి ప్రిపేర్ అయ్యారు. ఇద్దరూ జాబ్ కొట్టడంతో వారింట ఆనందం రెట్టింపయ్యింది. కాగా 891 మంది గ్రూప్-2 ఉద్యోగాలు సాధించారు.
Similar News
News February 16, 2026
విప్ ఇద్దామంటే BRSకు దొరకని ఆ MLAలు

TG: హంగ్ ఏర్పడ్డ మున్సిపాల్టీల్లో ఎక్స్ అఫీషియో సభ్యులుగా MLA, MLC, MP ఓట్లు కీలకంగా మారడంతో పార్టీలు వారికి విప్ జారీ చేస్తున్నాయి. వాటిని వ్యక్తిగతంగా అందించి సంతకాలు కూడా తీసుకోవాలి. BRSకు ఇదే తలపోటుగా మారింది. INCకి సన్నిహితంగా ఉంటున్న MLAలకు విప్ ఇద్దామంటే పార్టీకి వారెవరూ అందుబాటులో లేరు. వారెవరూ విప్ అందుకోలేదు. గద్వాల వంటి చోట్ల BRS MLAనే INC అభ్యర్థిని ఛైర్మన్ సీట్లో కూర్చోబెట్టారు.
News February 16, 2026
ఒకే గ్రామంలో 15 రోజుల్లో 12 మంది మృతి

హరియాణాలోని చాయన్సలో 15 రోజుల్లో 12 మరణాలు కలకలం రేపాయి. వీరిలో ఐదుగురు స్కూల్ విద్యార్థులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. గ్రామంలో దాదాపు ప్రతి ఇంట్లో ఒకరు జ్వరం, వాంతులతో బాధపడుతున్నట్లు అధికారులు తెలిపారు. కొందరి పరిస్థితి విషమంగా ఉంది. తాగునీరు కలుషితం కావడమే కారణమని అనుమానం వ్యక్తం చేశారు. 107 ఇళ్లలో వాటర్ శాంపిల్స్ సేకరించగా 23 చోట్ల బాక్టీరియా పెరుగుదల, క్లోరినేషన్ తక్కువగా ఉందని గుర్తించారు.
News February 16, 2026
మార్ముగావ్ పోర్ట్ అథారిటీలో పోస్టులు

మార్ముగావ్ పోర్ట్ అథారిటీలో 13 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి డిగ్రీ, బీటెక్, పీజీ, MBA, MSc, BSc, ME/MTech(ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్), MBBSఅర్హతతో పాటు పని అనుభవం గలవారు దరఖాస్తుతో పాటు డాక్యుమెంట్స్ను ఆన్లైన్/ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://mptgoa.gov.in


