News August 12, 2025

ఆనాటి ఉద్యమ సారథి కల్లూరి చంద్రమౌళి

image

1942లో క్విట్ ఇండియా తీర్మానంలో పాల్గోన్న ప్రముఖ స్వాతంత్ర యోధుడు కల్లూరి చంద్రమౌళి తిరిగి తెనాలికి వచ్చారు. దీనిలో భాగంగా 1942 ఆగస్టు 12న ఆయన నాయకత్వంలో తెనాలిలో ఉద్యమం జరిగింది. శాంతియుత అందోళన అదుపు తప్పి హింసాత్మక రూపు ధరించింది. తెనాలి రైల్వై స్టేషన్ పూర్తిగా తుగలపెట్టిన ఆందోళనకారులు తమ తదుపరి లక్ష్యంగా తాలుకా ఆఫీస్ వైపు వెళ్తుండగా పోలీసులు కాల్పులు జరపటంతో 7 మృతి చెందగా అనేకమంది గాయపడ్డారు.

Similar News

News September 8, 2025

CBI పేరుతో రూ.62.25 లక్షలు ఫ్రాడ్

image

గుంటూరు భారతపేట ప్రాంతానికి చెందిన ఓ కన్‌స్ట్రక్షన్ వ్యాపారం చేసే వ్యక్తికి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు సీబీఐ పేరుతో రూ.62.25 లక్షలు టోకరా వేశారు. సీబీఐ నుంచి మాట్లాడుతున్నామని, మనీ లాండరింగ్ కేసులో అరెస్టు చేస్తామని బెదిరించారు. అరెస్టు చేయకుండా ఉండాలంటే క్లియరెన్స్ కోసం రూ.62.25 లక్షలు కట్టాలనడంతో నగదు చెల్లించాడు. అయినా కూడా ఫోన్లు చేసి బెదిరిస్తూనే ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News September 8, 2025

GNT: వృద్ధురాలిపై అత్యాచారం

image

బాపట్ల పరిధిలోని నగరం మండలంలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ గ్రామానికి చెందిన యువకుడు తన స్నేహితులతో కలిసి ఈనెల 1వ తేదీ రాత్రి మద్యం తాగాడు. ఆ తర్వాత మత్తులో తనకు నానమ్మ వరుసయ్యే 65 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం చేశాడు. బంధువులు గమనించి వృద్ధురాలిని గుంటూరు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితురాలి తరఫున నగరం పోలీసులకు ఆదివారం ఫిర్యాదు అందగా ఎస్ఐ భార్గవ్ కేసు నమోదు చేశారు.

News September 8, 2025

గుంటూరు జీజీహెచ్‌లో 500 పడకల బ్లాకు

image

గుంటూరు జీజీహెచ్‌లో మాతా, శిశు వైద్య సేవలను మెరుగుపరచడానికి కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రూ.86 కోట్లతో నిర్మిస్తున్న 500 పడకల బ్లాకులో వైద్య పరికరాల కొనుగోలుకు మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆమోదం తెలిపారు. ఈ చర్యలతో గర్భిణులు, నవజాత శిశువుల మరణాలను తగ్గించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.