News November 19, 2025

ఆన్‌లైన్‌లో అమ్మాయిలపై వేధింపుల్లో HYD ఫస్ట్!

image

నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ప్రకారం ఆన్‌లైన్‌లో చిన్నారులు, మహిళలపై జరుగుతున్న వేధింపుల్లో దేశంలోనే HYD నం.1గా నిలిచింది. ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే ఇలాంటి ఘటనలు హైదరాబాద్‌లో ఎక్కువగా నమోదయ్యాయి. ఆన్‌లైన్‌లో అసభ్య మెసేజ్‌లు పంపడం, మార్ఫింగ్ ఫొటోలు పంపించడం, అమ్మాయికి నచ్చకపోయినా వరుసగా మెసేజ్‌లు పంపుతూ ఇబ్బంది పెట్టడం వంటి వేధింపులు ప్రధానంగా కనిపిస్తున్నాయని నివేదికలో వెల్లడైంది.

Similar News

News April 5, 2026

రామప్ప ప్రాంగణంలో కామేశ్వరాలయం పునరుద్ధరణకు శ్రీకారం

image

ములుగు జిల్లా పాలంపేటలోని ప్రసిద్ధ రామప్ప దేవాలయ సముదాయంలో ఉన్న కామేశ్వరాలయం పునరుద్ధరణకు కేంద్ర పురావస్తు శాఖ చర్యలు ప్రారంభించింది. దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన ఈ ఆలయాన్ని తిరిగి పూర్వ వైభవానికి తీసుకురావడానికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. దాదాపు రూ.6.86 కోట్లతో పునర్నిర్మాణ పనులు చేపట్టేందుకు టెండర్ ప్రక్రియ పూర్తికి చేరుకుంది. ఆలయంలోని శిల్పాలు, నిర్మాణ భాగాలను సంరక్షించనున్నారు.

News April 5, 2026

కొండగట్టు అంజన్నకు రూ.1.63 కోట్ల ఆదాయం!

image

కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారి చిన్న హనుమాన్ జయంతి వేడుకలు కనులపండువగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయానికి రూ.1.63 కోట్ల ఆదాయం సమకూరినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో అత్యధికంగా ప్రసాదాల విక్రయం ద్వారా రూ.1.10 కోట్లు రాగా, దీక్షల విరమణ ద్వారా రూ.33.16 లక్షలు, దర్శనం తదితర సేవల ద్వారా మిగిలిన మొత్తాన్ని భక్తులు సమర్పించుకున్నారు.

News April 5, 2026

GNT: రూ.లక్షల్లో మోసం.. మహిళపై కేసు

image

బంగారం షాపు యజమానిని మోసం చేసిన మహిళపై అరండల్ పేట స్టేషన్‌లో కేసు నమోదైంది. ఫైనాన్స్‌లో ఉన్న తన బంగారాన్ని విడిపించు కోవాలని చెప్పి ఓ మహిళ బంగారం షాపు యజమాని వద్ద రూ.19 లక్షల నగదుతో పాటు రూ.4 లక్షల విలువైన ఆభరణాలను అప్పుగా తీసుకుంది. ఆమె తీసుకున్న నగదు, బంగారాన్ని తిరిగి ఇవ్వకుండా తాత్సారం చేస్తోంది. దీంతో బంగారం షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు.