News November 19, 2025

ఆన్లైన్ మోసాలపై తస్మాత్ జాగ్రత్త: ప్రకాశం SP

image

ఆన్‌లైన్ మోసాలపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా SP హర్షవర్ధన్ రాజు సూచించారు. మంగళవారం ఒంగోలు SP కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఇటీవల కాలంలో ఆన్‌లైన్ మోసాలు పెరుగుతున్నాయని అన్నారు. ఫ్రాడ్ కాల్ స్కామ్‌ల ద్వారా సైబర్ మోసగాళ్లు అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుంటున్నారని తెలిపారు. ఇలాంటి మోసాలపై హెల్ప్ లైన్ నంబర్ 1930కు సమాచారం ఇవ్వాలని కోరారు.

Similar News

News February 5, 2026

ప్రకాశం జిల్లాలో పోస్టాఫీస్ ఉద్యోగాలు.. ఖాళీలు ఇవే

image

ప్రకాశం డివిజన్ పరిధిలోని అన్నబోయినపల్లి, చాగళ్లు, దూబగుంట, జె.పంగలూరు, కందలూరు,మర్లపాడు, ఎం. నిడమనూరుతో పాటు 52 చోట్ల బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. రూ.12 వేల నుంచి రూ.24,470 జీతం లభిస్తుంది. దరఖాస్తుకు చివరి తేదీ ఈ నెల 16. పదో తరగతి పాసైతే చాలు. ఖాళీల వివరాల కోసం ఇక్కడ <>క్లిక్ <<>>చేయండి.

News February 5, 2026

వాట్సప్ మెసేజ్‌లు నమ్మి పెట్టుబడులు పెట్టొద్దు : ఎస్పీ

image

వాట్సాప్ మెసేజ్‌లు నమ్మి పెట్టుబడులు పెట్టరాదని మార్కాపురం జిల్లా ఇన్‌ఛార్జ్ ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఒక ప్రకటనలో హెచ్చరించారు. పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలని, తెలియని వాట్సప్ గ్రూపులలో జాయిన్ కావద్దన్నారు. ఈజీ మనీ ఆశతో ఎలాంటి లింకులను ఓపెన్ చేయొద్దు అన్నారు. వాట్సాప్‌లో వచ్చే APK ఫైల్ డౌన్లోడ్ చేయవద్దని సూచించారు. సైబర్ క్రైమ్ బాధితులైతే 1930కి కాల్ చేయాలని పేర్కొన్నారు.

News February 5, 2026

ప్రకాశం: బ్రెయిన్ స్ట్రోక్‌తో ఆర్మీ జవాన్ మృతి

image

కంభం మండలంలోని తురిమెళ్ల గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ యేలం వెంకటరమణ (45) అస్సోం రాష్ట్రంలోని దిబ్రూగడ్‌లో బ్రెయిన్ స్ట్రోక్‌తో మరణించారు. విధుల్లో ఉండగా సోమవారం అస్వస్థతకు గురైన ఆయనను ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. నెల రోజుల క్రితమే తండ్రి వేమయ్య మృతి చెందడంతో సొంత గ్రామానికి వచ్చి తండ్రి దశదినకర్మ నిర్వహించిన అనంతరం వెంకటరమణ విధుల్లో చేరారు.