News April 4, 2026
ఆన్సైట్ ఎఫ్ఐఆర్ నమోదుపై కరీంనగర్ సీపీ సమీక్ష

బాధితులకు త్వరితగతిన న్యాయం అందించడమే లక్ష్యంగా ఆన్సైట్ ఎఫ్ఐఆర్ విధానాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కరీంనగర్ సీపీ గౌష్ ఆలం అధికారులను ఆదేశించారు. ఎస్హెచ్ఓలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. సంఘటన స్థలంలోనే ఫిర్యాదు స్వీకరించి, ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్నారు. మహిళలు, చిన్నారుల కేసుల్లో వీడియో రికార్డింగ్, ఎస్ఓపీలు తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు.
Similar News
News April 12, 2026
ఇంటర్ సెకండియర్ RESULTS.. కరీంనగర్కు 7వ ర్యాంకు

ఇంటర్ 2ndఇయర్ ఫలితాలు విడుదలయ్యాయి. కరీంనగర్(D)లో రెగ్యులర్ విద్యార్థులు 14943 మంది పరీక్షలు రాయగా 11961 మంది పాసై 80.04 శాతంతో స్టేట్లోనే 7వ ర్యాంకు వచ్చింది. ఇక రెగ్యులర్ ఒకేషనల్లో 1320 మందికి 876 మంది పాసై 66.36 శాతంతో 30వ స్థానంలో నిలవగా రెగ్యులర్ ప్రైవేట్లో 1837 మందికి 591 మంది పాసై 32.17%తో 16వ స్థానంలో నిలిచింది. ఒకేషనల్ ప్రైవేట్లో 163 మందికి 71 మంది పాసై 43.56%తో 28th ప్లేస్ వచ్చింది.
News April 12, 2026
ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు.. కరీంనగర్కు 6వ ర్యాంకు

ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు విడుదలయ్యాయి. కరీంనగర్ జిల్లాలో రెగ్యులర్ ఫస్టియర్ విద్యార్థులు 16726 మంది పరీక్ష రాయగా 11737 మంది పాసై 70.17 శాతంతో స్టేట్లోనే 6వ ర్యాంక్లో నిలిచింది. ఇక ఒకేషన్లో 1,449 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 822 మంది విద్యార్థులు పాసై 56.73 శాతంతో స్టేట్లో 24వ స్థానంలో నిలిచింది.
News April 12, 2026
KNR: మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మహేష్

మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య ఆధ్వర్యంలో కరీంనగర్కు చెందిన మేడి మహేష్ను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించారు. తనపై నమ్మకంతో నియమించిన నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సంఘం అభివృద్ధికి కృషి చేస్తానని మహేష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు బూరుగుల వెంకటేశ్వర్లు, గ్రేటర్ హైదరాబాద్ కమిటీ సభ్యులు, సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు జంజీరపు ఎల్లేష్ తదితరులు పాల్గొన్నారు.


