News December 23, 2025
ఆపదలో ఉన్నవారి లొకేషన్ కనిపెట్టే గూగుల్ ఫీచర్!

ఇండియాలో గూగుల్ Android Emergency Location Service (ELS)ను లాంచ్ చేసింది. ప్రమాదంలో ఉన్నప్పుడు 112కి కాల్ లేదా మెసేజ్ చేస్తే మీ ఫోన్ ఆటోమేటిక్గా మీ లొకేషన్ను పోలీసులకు పంపిస్తుంది. కాల్ కట్ అయినా సరే GPS, Wi-Fi సిగ్నల్స్ ద్వారా మీరు ఎక్కడున్నారో వాళ్లు ఈజీగా కనిపెట్టగలరు. ఈ ఫ్రీ సర్వీస్ ప్రస్తుతం UPలో అందుబాటులోకి వచ్చింది. త్వరలో మిగతా రాష్ట్రాల్లో కూడా మొదలుకానుంది.
Similar News
News January 2, 2026
వాస్తు మన సౌభాగ్యానికి తొలి మెట్టు

వాస్తు నియమాలు పాటించే ఇంట్లో సిరిసంపదలకు లోటుండదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. సరైన వాస్తు వల్ల కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడి, మనసులో ప్రభావవంతమైన ఆలోచనలు కలుగుతాయని అంటున్నారు. ‘ఇవి కొత్త అవకాశాలను సృష్టిస్తాయి. ఆదాయ వృద్ధికి బాటలు వేసి సకల సౌకర్యాలు, సదుపాయాలు కల్పిస్తాయి. అంతిమంగా ఇవి ఆనందాన్ని, మానసిక సంతృప్తిని అందిస్తాయి. వాస్తు అభ్యున్నతికి ఆధారం’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>
News January 2, 2026
పేదల కోసం నిలబడకుండా వెళ్లిపోయారు: భట్టి

TG: ఉపాధి హామీ పథకంపై సభలో మాట్లాడకుండా BRS నేతలు వెళ్లిపోవడం విచారకరమని Dy.CM భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ‘కోట్లాది మంది నిరుపేదల కోసం BRS అలియాస్ TRS నేతలు మాట్లాడాల్సింది. కానీ, వాళ్లు వారి స్వార్థ ప్రయోజనాల కోసం పేదలను వదిలేశారు. ఈ చట్టాన్ని మార్చకూడదని, పాతదే కొనసాగించాలని చాలా రాష్ట్రాలు ఏకగ్రీవ తీర్మానం చేశాయి. మనమూ అలాంటి తీర్మానం చేసి పేదల పక్షాన నిలబడదాం’ అని విజ్ఞప్తి చేశారు.
News January 2, 2026
‘ఉపాధి’కి గాంధీ పేరు కొనసాగించాలంటూ సభలో తీర్మానం

TG: ఉపాధి హామీ పథకంపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ జరిగింది. మహాత్మా గాంధీ పేరును యథాతథంగా కొనసాగించాలంటూ సీఎం రేవంత్ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. అలాగే కొత్తగా తెచ్చిన రూల్స్ వల్ల రాష్ట్రాలకు నష్టం కలుగుతోందన్నారు. ఉపాధి పనులకు గతంలో కేంద్రమే 100% నిధులు కేటాయించేదని, ఇప్పుడు 60-40 శాతానికి మార్చడం వల్ల రాష్ట్రాలపై ఆర్థిక భారం పడుతుందని మండిపడ్డారు. అనంతరం సభను స్పీకర్ రేపటికి వాయిదా వేశారు.


