News April 17, 2024

ఆమదాలవలస ఎమ్మెల్యే అభ్యర్థిగా గౌరీ శంకర్

image

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం బూర్జ మండలం నీలంపేట గ్రామానికి చెందిన గౌరీ శంకర్‌ జై భారత్ నేషనల్ పార్టీ(జే‌బీ‌ఎన్‌వై) తరఫున MLA అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వీవీ లక్ష్మీనారాయణ ఓ ప్రకటన విడుదల చేశారు. మంగళవారం విడుదల చేసిన అసెంబ్లీ నియోజకవర్గాల జాబితాలో గౌరీ శంకర్ పేరును ఆ పార్టీ అధ్యక్షుడు ఖరారు చేశారు.

Similar News

News April 23, 2025

SKLM: గ్రామదేవతల సిరిమాను ఉత్సవంపై సమీక్ష

image

అన్ని శాఖల సమన్వయంతో శ్రీ గ్రామదేవతల సిరిమాను ఉత్సవం ఏర్పాట్లపై దృష్టి సారించాలని జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర రావు అన్నారు. బుధవారం కలెక్టరెట్ మందిరంలో గ్రామదేవతల సిరిమాను ఉత్సవం ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. సమన్వయంతో విధులు నిర్వహించి పండగ ఒక మంచి వాతావరణంలో జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. 

News April 23, 2025

శ్రీకాకుళంలో ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థి సూసైడ్

image

ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాల్లో మార్కులు త‌క్కువ‌గా వచ్చాయని శ్రీ‌కాకుళానికి చెందిన విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌కు పాల్పడ్డాడు.  బ‌ల‌గ ప్రాంతానికి చెందిన గురుగుబిల్లి వేణుగోపాల‌రావుకు బుధ‌వారం విడుద‌లైన ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్షా ఫ‌లితాల్లో 393 మార్కులు వచ్చాయి. త‌క్కువ రావడంతో మ‌న‌స్థాపానికి గురై ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. గ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి.

News April 23, 2025

శ్రీకాకుళం : టెన్త్ రిజల్ట్స్.. 23,219 మంది పాస్

image

పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 28,176 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 23,219 మంది పాసయ్యారు. 14,287 మంది బాలురు రాయగా 11,358 మంది పాసయ్యారు. 13,889 మంది బాలికలు పరీక్ష రాయగా 11,861 మంది పాసయ్యారు. 82.41 పాస్ పర్సంటేజ్ తో శ్రీకాకుళం జిల్లా 14వ స్థానంలో నిలిచింది. గతేడాది రెండో స్థానంలో నిలవగా.. 14వ స్థానానికి పడిపోయింది.

error: Content is protected !!