News August 24, 2025
ఆయిల్ పాం ఫ్యాక్టరీ పనులు పూర్తి చేయాలి: మంత్రి తుమ్మల

నంగునూరు మండలం నర్మెట్టలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ పనులను సత్వరమే పూర్తయ్యేలా చూడాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ఆయిల్ ఫెడ్ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. నిర్మాణ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఆయిల్ పాం ఫ్యాక్టరీ పనులు అనుకున్న స్థాయిలో జరగకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు సమీక్షలో పాల్గొన్నారు.
Similar News
News August 24, 2025
కర్నూలు: ఒకే ఊరిలో 21 మందికి టీచర్ ఉద్యోగాలు

దేవనకొండ మండలం తెర్నేకల్ గ్రామానికి చెందిన 21 మంది డీఎస్పీ మెరిట్ లిస్టులో అర్హత సాధించారు. వీరిలో 17 మంది ఎస్జీటీ పోస్టులు, ఒకరు పీఈటీ, మరో ముగ్గురు స్కూల్ అసిస్టెంట్లు ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. వీరిని గ్రామస్థులు అభినందించారు. తమ తల్లిదండ్రులు కష్టపడి చదివించారని, వారి కష్టం వృథా కాలేదని వారు పేర్కొన్నారు.
News August 24, 2025
రైలులో తరలిస్తున్న మాదకద్రవ్యాలు స్వాధీనం

రైలులో అక్రమంగా తరలిస్తున్న మాదక ద్రవ్యాలను ఈగల్ సెల్ బాపట్ల టీం సభ్యులు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం బాపట్ల రైల్వే స్టేషన్ నుంచి పూరి-తిరుపతి ఎక్స్ప్రెస్లో ఈగల్ సెల్, రైల్వే పోలీసులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. రైలులో అక్రమంగా తరలిస్తున్న ఎనిమిది కిలోల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశామన్నారు.
News August 24, 2025
సిరిసిల్ల: సోషల్ మీడియాపై పోలీసుల ప్రత్యేక నిఘా

సామాజిక మాధ్యమాల్లో విద్వేషపూరిత పోస్టులు పెట్టేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సిరిసిల్ల ఎస్పీ హెచ్చరించారు. అలాంటి పోస్టులు శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తాయని, వాటిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నిజానిజాలు తెలుసుకోకుండా ఎలాంటి మెసేజ్లను ఫార్వర్డ్ చేయవద్దని సూచించారు. జిల్లా పోలీస్ శాఖ సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా పెట్టిందని ఆయన స్పష్టం చేశారు.