News February 15, 2025

ఆరోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి: కామారెడ్డి కలెక్టర్

image

రానున్న వేసవి దృష్ట్యా వైద్య సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆశిశ్ సాంగ్వాన్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌లో ఆరోగ్య శాఖకు సంబంధించిన కర పత్రాలు, గోడ ప్రతులను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న వేసవిలో అధిక ఉష్ణోగ్రతల వల్ల వడదెబ్బ తదితర అత్యవసర పరిస్థితుల్లో.. ఆరోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ.. వెంటనే స్పందించాలని ఆదేశించారు.

Similar News

News September 18, 2025

జగిత్యాల: ఒంటరి వృద్ధులను లక్ష్యంగా చేసుకున్న చైన్‌స్నాచర్లు

image

JGTL(D)లో చైన్‌స్నాచర్లు రెచ్చిపోతున్నారు. ఇటీవల పోరండ్లలో వృద్ధురాలు బంగారం కోల్పోయిన ఘటన మరవకముందే మరో దొంగతనం వెలుగులోకి వచ్చింది. JGTL(R) సంఘంపల్లేకు చెందిన నేరెళ్ల లచ్చవ్వ ఇంట్లో ఒంటరిగా ఉండడాన్ని గమనించిన దుండగుడు.. మనవడిగా మభ్యపెట్టి నీళ్లు తీసుకున్నాడు. క్షణాల్లోనే ఆమె మెడలో ఉన్న తులం నర పుస్తెలతాడు లాక్కెళ్లాడు. వృద్ధులను స్నాచర్లు టార్గెట్ చేస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు.

News September 18, 2025

మరికాసేపట్లో నీరజ్ ఫైనల్ ఈవెంట్

image

వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ జావెలిన్ త్రో ఫైనల్ సా.3.53 నిమిషాలకు ప్రారంభం కానుంది. ఇండియా తరఫున నీరజ్ చోప్రా బరిలోకి దిగనున్నారు. ఫైనల్ ఈవెంట్లో మొత్తం 12 మంది పోటీ పడుతున్నారు. అయితే జూలియన్ వెబెర్(జర్మనీ) పెటెర్స్(గ్రెనెడా), అర్షద్ నదీమ్(పాక్) నుంచి నీరజ్‌కు గట్టి పోటీ ఎదురుకానుంది. వారందరినీ వెనక్కి నెట్టి అతడు బంగారు పతకం సాధించాలని కోరుకుందాం.
ALL THE BEST NEERAJ(హాట్‌స్టార్‌లో లైవ్)

News September 18, 2025

భూగర్భ జలాలను పెంచాలి: గోదావరి డెల్టా ఛైర్మన్

image

భూగర్భ జలాలను పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గోదావరి డెల్టా ఛైర్మన్ సునీల్ కుమార్ తెలిపారు. కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనాను కలిసి భూగర్భ జలాలు పెంచేందుకు తయారుచేసిన ప్రాజెక్టు రిపోర్టును అందజేశారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచనల మేరకు చెరువులు కాలువల్లో భూగర్భ జలాలను పెంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గోదావరి డెల్టా ఛైర్మన్ సునీల్ కుమార్ తెలిపారు.