News July 10, 2025
ఆర్చరీ వరల్డ్ కప్లో అదరగొట్టిన విజయవాడ యువతి

విజయవాడకు చెందిన ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ మాడ్రిడ్ (స్పెయిన్)లో జరుగుతున్న ఆర్చరీ వరల్డ్ కప్లో అదరగొట్టే ప్రదర్శన చేసింది. మహిళలు, మిక్స్డ్ టీమ్ విభాగంలో జ్యోతి సురేఖ ప్రాతినిధ్యం వహిస్తున్న భారత జట్టు ఫైనల్కు దూసుకెళ్లింది. సురేఖ, పర్ణీత్, ప్రీతికలతో కూడిన మహిళా బృందం, అలాగే మిక్స్డ్ విభాగంలో రిషభ్, సురేఖలు బుధవారం జరిగిన సెమీస్లో మెరుగైన పాయింట్లు సాధించి ఫైనల్లో అదరగొట్టారు.
Similar News
News July 10, 2025
భీమడోలులో అనుమానస్పదంగా బాలిక మృతి

భీమడోలు గురుకుల కళశాలలో ఓ బాలిక అనుమానస్పదంగా మృతి చెందింది. వసతి గృహంలో గురువారం సాయంత్రం విగతజీవిగా పడి ఉండడంతో నిర్వహకులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యలు మృతి చెందినట్లు చెప్పారు. ఈ చిన్నారి భీమడోలు మండలం అర్జవారిగూడెం గ్రామానికి చెందిన విద్యార్థిగా గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.
News July 10, 2025
సికింద్రాబాద్: 2,500 మంది పోలీసులతో బందోబస్తు

ఆదివారం ఉజ్జయిని మహాకాళి బోనాల జాతరకు 2,500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు నార్త్ జోన్ DCP రష్మీ పెరుమాళ్ వెల్లడించారు. ఆలయ ఆవరణలో ఈ రోజు జాతర కోఆర్డినేషన్ కమిటీ సమావేశం జరిగింది. భక్తుల సందర్శనకు 6 క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జాతర రోజు మ.1 నుంచి 3 గంటల మధ్య శివసత్తులకు ప్రత్యేక దర్శనం ఉంటుందన్నారు. దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్కు ప్రత్యేక క్యూలైన్లు ఉంటాయన్నారు.
News July 10, 2025
BRAOUలో ఏ పరీక్షలు వాయిదా అంటే!

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరిధిలో BLISC పరీక్షలను వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు. ఈనెల 12వ తేదీ నుంచి ఈ పరీక్షలను నిర్వహించనున్నట్లు ప్రకటించినప్పటికీ వివిధ కారణాల రీత్యా వాయిదా వేసినట్లు చెప్పారు. ఈ పరీక్షల తేదీలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు. పూర్తి వివరాలకు వర్సిటీ వెబ్సైట్, స్టడీ సెంటర్లలో సంప్రదించాలని సూచించారు.