News July 10, 2025

ఆర్చరీ వరల్డ్ కప్‌లో అదరగొట్టిన విజయవాడ యువతి

image

విజయవాడకు చెందిన ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ మాడ్రిడ్ (స్పెయిన్)లో జరుగుతున్న ఆర్చరీ వరల్డ్ కప్‌లో అదరగొట్టే ప్రదర్శన చేసింది. మహిళలు, మిక్స్‌డ్ టీమ్ విభాగంలో జ్యోతి సురేఖ ప్రాతినిధ్యం వహిస్తున్న భారత జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. సురేఖ, పర్ణీత్, ప్రీతికలతో కూడిన మహిళా బృందం, అలాగే మిక్స్‌డ్ విభాగంలో రిషభ్, సురేఖలు బుధవారం జరిగిన సెమీస్‌లో మెరుగైన పాయింట్లు సాధించి ఫైనల్‌లో అదరగొట్టారు.

Similar News

News July 11, 2025

బీఎస్పీ పెద్దపల్లి జిల్లా ఈసీ సమావేశం

image

బహుజన్ సమాజ్ పార్టీ పెద్దపల్లి జిల్లా ఈసీ సమావేశాన్ని ఈరోజు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్ ఆదేశాలతో జిల్లా అధ్యక్షుడు ఇరికిల రాజన్న నేతృత్వంలో నిర్వహించారు. గ్రామ స్థాయి నిర్మాణం, పార్టీ అభివృద్ధి, వచ్చే MPTC, ZPTC ఎన్నికల కోసం అభ్యర్థుల సంసిద్ధంపై చర్చించారు. ఈ సమావేశంలో నేతలు నార్ల గోపాల్ యాదవ్, కొంపల్లి బాబు, నక్క తిరుపతి, బొంద్యాలు, జింక ఉదయ్, జనగామ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

News July 11, 2025

శ్రీకాకుళం జిల్లా టుడే టాప్ న్యూస్ ఇవే

image

✯ మెళియాపుట్టి: విద్యుత్ షాక్ తో 5వ తరగతి విద్యార్థి మృతి
✯మందసలో అధికారులను అడ్డుకున్న రైతులు
✯ విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే రవికుమార్
✯ సారవకోట: లారీని ఢీకొన్న ఆటో.. ఐదుగురికి తీవ్ర గాయాలు
✯ కళింగపట్నంలో పనులను పరిశీలించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
✯ పలాస: గంజాయితో ముగ్గురు అరెస్ట్
✯ కంచిలి: అధ్వానంగా ఆసుపత్రి పరిసరాలు
✯ టెక్కలి: శాకాంబరీదేవిగా శివదుర్గ అమ్మవారు

News July 11, 2025

NLG: ఈ ఎన్నికల్లోనే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు

image

బీసీలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయనున్నారు. సీఎం రేవంత్ అధ్యక్షతన ఇవాళ జరిగిన క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. పంచాయతీరాజ్ చట్ట సవరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1740 గ్రామపంచాయతీలు ఉన్నాయి. దీంతో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం సీట్లు దక్కనున్నాయి.