News October 18, 2024
ఆర్టీసీ బస్సును ఓవర్ టేక్ చేయబోయి…అనంతలోకాలకు
ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన <<14388888>>పెద్దకొత్తపల్లి <<>>మండలం వెన్నచర్ల గ్రామ శివారులో జరిగింది. స్థానికుల వివరాలు.. అదే గ్రామానికి చెందిన సందడి శైలేష్(19) పంట పొలంలో పురుగు మందు పిచికారి చేసేందుకు తన ఇద్దరి స్నేహితులతో కలిసి బైక్ పై వెళ్తుండగా.. ఆర్టీసీ బస్సును ఓవర్ టేక్ చేయబోయాడు. వెనకాల ఉన్న మరో ఇద్దరు యువకులు కిందికి దూకగా బైక్ నడుపుతున్న యువకుడు బస్సు కింద నలిగి మృత్యువాత పడ్డాడు.
Similar News
News October 18, 2024
MBNR: పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్
హన్వాడ మండలం అమ్మాపూర్ తాండ పంచాయతీ కార్యదర్శి శివప్రకాశ్ శుక్రవారం అధికారులు సస్పెండ్ చేశారు. శివప్రకాశ్ గతంలో జడ్చర్ల మండలం పోలేపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిచేశాడు. ఈయన పని చేసిన కాలంలో రూ.1.73 కోట్ల గ్రామ పంచాయతీ నిధులు దుర్వినియోగం అయ్యాయని గత నెలలో జరిపిన DPLO విచారణలో తేలింది. ఈ మేరకు సస్పెన్షన్కు గురయ్యారు.
News October 18, 2024
ఉమ్మడి జిల్లా నేటి వర్షపాత వివరాలు..
ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో 29.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. గద్వాల జిల్లా కేంద్రంలో 15.0 మిల్లీమీటర్లు, వనపర్తి జిల్లా పెబ్బేరులో 11.5 మిల్లీమీటర్లు, నారాయణపేట జిల్లా నర్వలో 7.8 మిల్లీమీటర్లు, మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో 6.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.
News October 18, 2024
సనాతన ధర్మ పరిరక్షణకు యువకుడి సైకిల్ యాత్ర
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బోయపల్లికి చెందిన మల్లేశ్ దేశంలోని ద్వాదశ (12) జ్యోతిర్లింగాల దర్శనార్థం గురువారం సైకిల్ యాత్రకు శ్రీకారం చుట్టాడు. మొదటగా పాలమూరు నుంచి తాండూరు మార్గంలో యాత్ర సాగనుంది. రోజుకు 100 కి.మీ.లు సైకిల్ యాత్ర చేసి స్థానిక ఆలయాల్లో బస చేస్తానని తెలిపాడు. సనాతన ధర్మ పరిరక్షణ ఆవశ్యకతను వివరిస్తూ ఈ యాత్ర కొనసాగించనున్నట్లు అతడు పేర్కొన్నాడు.