News October 31, 2025
ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు శుభవార్త

AP: ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు, వారి జీవిత భాగస్వాములకు RTC ఆస్పత్రులతోపాటు EHS హాస్పిటల్స్లోనూ ఉచిత వైద్యం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2020 JAN 1 తర్వాత రిటైరైన వారికి ఈ సౌకర్యం వర్తించనుంది. సూపరింటెండెంట్ కేటగిరీ వరకు ₹38,572, అసిస్టెంట్ మేనేజర్, ఆపై ర్యాంకు ఉన్నవారు ₹51,429 ఓసారి ప్రీమియం చెల్లిస్తే జీవితాంతం చికిత్స పొందవచ్చు. రెగ్యులర్ ఉద్యోగుల్లా రీయింబర్స్మెంట్ సౌకర్యమూ ఉంటుంది.
Similar News
News November 1, 2025
JEE మెయిన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం

జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) మెయిన్-2026 దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. <
News November 1, 2025
IPL: LSG హెడ్ కోచ్గా యువరాజ్ సింగ్?

IPL-2026లో LSG హెడ్ కోచ్గా యువరాజ్ సింగ్ వ్యవహరించనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే ఆ ఫ్రాంఛైజీ ఆయనతో చర్చలు జరిపినట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. గత సీజన్లో LSG కోచ్గా ఆసీస్ మాజీ ప్లేయర్ జస్టిన్ లాంగర్ పనిచేశారు. పంత్ కెప్టెన్గా ఉన్నారు. ఈ జట్టు పాయింట్స్ టేబుల్లో ఏడో స్థానానికి పరిమితమైంది. కాగా ఇటీవల NZ క్రికెటర్ విలియమ్సన్ను స్ట్రాటజిక్ అడ్వైజర్గా నియమించింది.
News November 1, 2025
ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా ప్రజా పాలన విజయోత్సవాలు: Dy.CM

TG రైజింగ్, రాష్ట్ర ఆవిర్భావం, అభివృద్ధి అంశాలు కలగలిపి ఒక సమగ్ర ప్రణాళికతో ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా ప్రజా పాలన విజయోత్సవాలు (DEC 1-9) నిర్వహించాలని Dy.CM భట్టి అన్నారు. భవిష్యత్తులో TG ఏం సాధించబోతుందనే విషయాలను ప్రపంచానికి వివరించేలా కార్యక్రమాలు ఉండాలని సమీక్ష సమావేశంలో అధికారులకు సూచించారు. విజయోత్సవాలకు పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్నామని, భారీగా MOUలు జరిగేలా వాతావరణం ఉండాలన్నారు.


