News April 11, 2025
ఆర్మీ మేజర్గా మంచిర్యాల బిడ్డ మీనాక్షి గ్రేస్

మేజర్ పదోన్నతి పొందిన మీనాక్షి గ్రేస్ను చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. జైపూర్ మండలం కుందారం గ్రామానికి చెందిన మీనాక్షి గ్రేస్ భారత సైన్యంలో కెప్టెన్ నుంచి మేజర్గా పదోన్నతి పొందిన సందర్భంగా ఎమ్మెల్యే ఆమె స్వగృహానికి వచ్చారు. నియోజకవర్గానికి గర్వకారణంగా నిలిచారని కొనియాడారు. దేశ సేవకు చేసిన కృషి ప్రతి యువతకి ఆదర్శంగా నిలవాలన్నారు.
Similar News
News October 19, 2025
నితీశ్.. ఇక ఆల్ ఫార్మాట్ ప్లేయర్

తెలుగు ప్లేయర్ నితీశ్కుమార్ రెడ్డి ఇవాళ వన్డేల్లో అరంగేట్రం చేశారు. AUSతో తొలి వన్డేలో జట్టులో చోటు దక్కించుకున్నారు. ఇప్పటికే టీ20, టెస్టుల్లో అరంగేట్రం చేసిన NKR ఇప్పుడు ఆల్ ఫార్మాట్ ప్లేయర్గా అవతరించారు. గతేడాది NOV 22న విరాట్ కోహ్లీ నుంచి టెస్ట్ క్యాప్ అందుకోగా తాజాగా రోహిత్ శర్మ చేతులమీదుగా వన్డే క్యాప్ తీసుకున్నారు. ఇవి నితీశ్ కెరీర్లో మరిచిపోలేని మూమెంట్స్గా మిగిలిపోనున్నాయి.
News October 19, 2025
మహిళలను వేధిస్తున్న 44 మంది అరెస్ట్

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో షీ టీమ్ బృందాలు వివిధ ప్రాంతాల్లో మహిళలను వేధిస్తున్న 44 మంది ఆకతాయిలను అరెస్ట్ చేశాయి. 12 మంది మహిళలు ఇచ్చిన ఫిర్యాదులపై విచారణ కొనసాగుతోందని DCP సృజన కర్ణం తెలిపారు. యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ సహకారంతో ఆరుగురు ట్రాంజెండర్స్తోపాటు 12 మంది సెక్స్ వర్కర్లను అరెస్టు చేశారు. CP ఆదేశాల మేరకు ప్రత్యేకమైన తనిఖీలు కొనసాగుతాయని ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తమకు తెలపాలన్నారు.
News October 19, 2025
పెద్దేముల్: రూ.2 వేల కోసం హత్య

పెద్దేముల్ మండలంలో 2023లో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. తాండూర్ DSP తెలిపిన వివరాలిలా.. బాలాజీకి ఇచ్చిన రూ.2,050ను తిరిగి ఇవ్వాలని మన్సాన్పల్లికి చెందిన రవి(39) గ్రామస్థుల ముందు గట్టింగా అడిగాడు. దీంతో బాలాజీ అవమానంగా భావించాడు. మద్యం తాగించి కత్తితో పొడవడంతో గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రవి చనిపోయాడు. పరారీలో ఉన్న నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.