News April 11, 2025
ఆర్మీ మేజర్గా మంచిర్యాల బిడ్డ మీనాక్షి గ్రేస్

మేజర్ పదోన్నతి పొందిన మీనాక్షి గ్రేస్ను చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. జైపూర్ మండలం కుందారం గ్రామానికి చెందిన మీనాక్షి గ్రేస్ భారత సైన్యంలో కెప్టెన్ నుంచి మేజర్గా పదోన్నతి పొందిన సందర్భంగా ఎమ్మెల్యే ఆమె స్వగృహానికి వచ్చారు. నియోజకవర్గానికి గర్వకారణంగా నిలిచారని కొనియాడారు. దేశ సేవకు చేసిన కృషి ప్రతి యువతకి ఆదర్శంగా నిలవాలన్నారు.
Similar News
News February 25, 2026
తిరుపతి: లవర్తో పెళ్లి కోసం కూతురినే చంపేసింది!

తిరుపతి పోస్టల్ కాలనీకి చెందిన ఆశాలత(19) భర్తతో విడిపోయి తన కుమార్తె దుర్గ(3)తో కలిసి పోస్టల్ కాలనీలో ఉంటోంది. ఏర్పేడు మండలం చెన్నంపల్లికి చెందిన రెడ్డికుమార్తో సహజీవనం చేస్తోంది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని.. అడ్డుగా ఉన్న కుమార్తెను చంపేశారు. మృతదేహాన్ని స్వర్ణముఖి నది దగ్గర పూడ్చిపెట్టారు. తన బిడ్డ, మనవరాలు ఈనెల 19నుంచి కనబడటం లేదని ఆశాలత తల్లి ఫిర్యాదు చేయడంతో ఇది వెలుగు చూసింది.
News February 25, 2026
‘UK బాకీ పడింది.. వడ్డీతో సహా చెల్లించాల్సిందే’.. ఇండియన్ పోరాటం!

మధ్యప్రదేశ్కు చెందిన 63ఏళ్ల వివేక్ రూఠియా తన తాత బ్రిటిష్ ప్రభుత్వానికి 1917లో ఇచ్చిన అప్పును తిరిగి వసూలు చేయాలని నిర్ణయించుకున్నారు. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం ‘ఇండియన్ వార్ లోన్’ పేరుతో నిధులు సేకరించగా వివేక్ తాత సేఠ్ జుమ్మా లాల్ ₹35,000 రుణంగా ఇచ్చారు. వడ్డీతో కలిపి ప్రస్తుతం ఆ మొత్తం ₹2కోట్లు ఉంటుందని అంచనా. ఈ సొమ్మును రికవరీ చేసేందుకు యూకే ప్రభుత్వంపై దావా వేయనున్నారు.
News February 25, 2026
భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ

వరంగల్ భద్రకాళి ఆలయంలో అమ్మవారు పచ్చని పట్టు వస్త్రాలు, విశేష సువర్ణ ఆభరణాలతో సర్వాంగ సుందరంగా దర్శనమిచ్చారు. శ్రీ విశ్వావసు నామ సంవత్సర శుక్లపక్షం పురస్కరించుకుని తెల్లవారుజాము నుంచే అర్చకులు అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, సహస్ర నామార్చనలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణమంతా శాంతి పాఠాల ఘోషతో మార్మోగింది. విశేష అలంకారంలో ఉన్న అమ్మను దర్శించుకునేందుకు భక్తులు వేకువజాము నుంచే బారులు తీరారు.


