News January 23, 2025
ఆర్మూర్: ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని నల్ల పోచమ్మ గల్లీకి చెందిన ఒక యువకుడు ఇంట్లో సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకుని మృతి చెందినట్లు సీఐ సత్యనారాయణ గౌడ్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతుడు కూలి పని చేస్తూ ఉంటాడని స్థానికులు తెలిపారు. ఆర్థిక సమస్యల వల్ల ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.
Similar News
News November 15, 2025
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ వేగవంతం చేయాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి

పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెలాఖరు నాటికి తప్పనిసరిగా పూర్తి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను కఠినంగా ఆదేశించారు. శనివారం ఆమె గృహ నిర్మాణ శాఖ పీడీ, ఆర్డీవోలు, తహసిల్దార్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం పూర్తయిన ఇండ్లను పారదర్శకంగా లబ్ధిదారులకు పంపిణీ చేయాలని స్పష్టం చేశారు.
News November 15, 2025
DRDOలో 18 అప్రెంటిస్లు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

<
News November 15, 2025
మదనపల్లి కిడ్నీ రాకెట్ కేసు ఐవోగా డీఎస్పీ మహీంద్ర

రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన మదనపల్లె కిడ్నీ రాకెట్ కేసుకు ఐవోగా డీఎస్పీ మహీంద్రను ఎస్పీ ధీరజ్ కునుబిల్లి నియమించారు. ఈ సందర్భంగా డీఎస్పీ శనివారం మాట్లాడారు. మదనపల్లి కిడ్నీ రాకెట్ కేసు కొత్తమలుపు తిరిగిందన్నారు. దోషులు ఎంతటి వారైనా ఏస్థాయిలో ఉన్న వదిలిపెట్టేది లేదన్నారు. ఇప్పటికే ఈ కేసులో సంబంధం ఉన్న వాళ్లను ఒక్కొక్కరిని లిఫ్ట్ చేయడానికి బృందాలు పనిచేస్తున్నాయని తెలిపారు.


