News March 20, 2025

‘ఆర్యవైశ్యులు సబ్సిడీ రుణాలను సద్వినియోగం చేసుకోవాలి’

image

ప్రభుత్వం అందించే సబ్సిడీ రుణాలను ఆర్యవైశ్యులు సద్వినియోగం చేసుకోవలని ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ నంద్యాల నాగేంద్ర అన్నారు. గురువారం ఆయన నగరంలోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం 2024-25 సంవత్సరానికి గాను సబ్సిడీతో కూడిన రుణాలను వివిధ వ్యాపారాల ఏర్పాటు చేసుకుని లబ్ధి పొందేందుకు 22వ తేదీ లోపు దరఖాస్తులను ఆన్‌లైన్ చేసుకోవాలని కోరారు.

Similar News

News March 21, 2025

కర్నూలు జిల్లా అభివృద్ధికి నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలి: కలెక్టర్

image

రాష్ర్ట ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా జిల్లా అభివృద్ధికి నిర్దేశించిన లక్ష్యాలను సాధించే విధంగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా జిల్లా అధికారులను ఆదేశించారు. ఈ నెల 25, 26 తేదీల్లో ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించనున్న నేపథ్యంలో గురువారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో ముఖ్యమైన అన్ని శాఖల జిల్లా అధికారులతో అభివృద్ధి కార్యక్రమాల అమలు, పురోగతిపై కలెక్టర్ చర్చించారు.

News March 20, 2025

కర్నూలు జిల్లా నేటి ముఖ్యాంశాలు

image

➤ ఎవరో వస్తారు.. ఏదో చేస్తారనుకుంటే పొరపాటే అనుకున్నారేమో ఆ రైతులు➤ ఈ నెల 22న ఓర్వకల్లుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాక➤ ఆటో బోల్తా.. 10 మంది వ్యవసాయ కూలీలకు గాయాలు➤ డిప్యూటీ సీఎం పర్యటనను విజయవంతం చేయండి: కలెక్టర్➤ జగన్ ఆదేశాలకు కట్టుబడి ఉంటా: ఆదోని మున్సిపల్ ఛైర్మన్➤ ట్రోఫీలు అందుకున్న జిల్లా నేతలు➤ పాఠశాలలు నిబంధనలు పాటించకపోతే కొరడా తప్పదు: డీఈవో➤ ఈతకెళ్లి ముగ్గురు మృతి

News March 20, 2025

నిబంధనలు పాటించకపోతే కొరడా తప్పదు: డీఈవో

image

జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ పాఠశాలలు వంటి పూట బడులను నిర్ధిష్ట వేళలు పాటించకుండా ఇస్తాను సారంగా నడిపితే చర్యలు తప్పవని జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ గురువారం అన్నారు. ఈ విషయంపై తమ దృష్టికి వస్తే పాఠశాలల మూసివేతకు ఆదేశాలు ఇస్తామని హెచ్చరించారు. ఒంటిపూట బడులకు సంబంధించి ప్రభుత్వం నిర్దేశించిన సమయ పాలనను ప్రైవేట్ యాజమాన్యాలు కచ్చితంగా పాటించాలని ఆదేశించారు.

error: Content is protected !!