News May 18, 2024

ఆలూరు ఏడీఈపై సస్పెన్షన్ వేటు

image

ఆలూరు విద్యుత్ శాఖ ఏడీఈ నాగేంద్ర ప్రసాద్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఎన్నికల ముందు రోజు హాలహర్వి మండలంలో పలుచోట్ల విద్యుత్ సేవలకు అంతరాయం ఏర్పడింది. హొలగుంద మండలంలో ట్రాన్స్‌ఫార్మర్, స్తంభాల అనధికారిక ఏర్పాట్లు, మే 13న పలు పోలింగ్ కేంద్రాల్లో మధ్యాహ్నం వరకు విద్యుత్ అసౌకర్యం నెలకొనడంతో పాటు విధి నిర్వహణలో అలసత్వం వహించడం, అవినీతికి పాల్పడడంతో ఉన్నతాధికారులు ఆయనపై వేటు వేశారు.

Similar News

News October 1, 2024

రాష్ట్రస్థాయి పోటీలకు ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు

image

రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు నందికొట్కూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ షేక్షావలి తెలిపారు. ఈనెల 25 నుంచి 28 వరకు కర్నూలు స్టేడియంలో జరిగిన ఎంపికలో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని చెప్పారు. తబస్సుమ్ (రగ్బీ), చరణ్ (ఖోఖో), సుధీర్ (కబడ్డీ), షాలెంరాజు (త్రోబాల్), పూజిత (రగ్బీ) ప్రతిభ కనబరిచారన్నారు.

News October 1, 2024

కర్నూలు: సీఎం చంద్రబాబు వరాల జల్లు

image

పత్తికొండ మం. పుచ్చకాయలమడకు CM చంద్రబాబు వరాలు కురిపించారు. 203 మందికి ఇళ్ల మంజూరు, 48 మందికి కొత్త పెన్షన్లు, 15 రేషన్ కార్డులు, ఐదుగురికి NREGC జాబ్ కార్డులు, 3 రేషన్ కార్డులు మంజూరు. 135 ఇళ్లకు ట్యాప్, ఒక ఇంటికి కరెంటు కనెక్షన్, 105 ఇళ్లకు మరుగుదొడ్లు, 1.7 KM డ్రైనేజీ కాలువ, 10.7 KM CC రోడ్డు, 22 మినీ గోకుళాలు.. వీటన్నింటికీ రూ.2.83 కోట్లు మంజూరు. మద్దికెర, పత్తికొండ, హోసూరుకు రోడ్లనిర్మాణం.

News October 1, 2024

పుచ్చకాయలమడ గ్రామానికి 203 ఇళ్లు: సీఎం చంద్రబాబు

image

పుచ్చకాయలమడ గ్రామంలోని సమస్యలను తెలుసుకున్నామని, ముఖ్యంగా ఇళ్ల సమస్య తన దృష్టికి వచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. పుచ్చకాయలమడ గ్రామంలో 203 మందికి ఇంటి జాగాలు కొని ఇళ్లు కట్టించి ఇచ్చే బాధ్యత తాను తీసుకుంటానని సీఎం తెలిపారు. 48 మందికి పెన్షన్లు లేవని, వారికి పెన్షన్లు ఇచ్చే బాధ్యత తీసుకుంటామని అన్నారు.