News March 1, 2025
ఆల్ ది బెస్ట్.. పరీక్షలు బాగా రాయండి: మంత్రి సత్యకుమార్

ఇంటర్మీడియట్ విద్యార్థులకు మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆల్ ది బెస్ట్ చెప్పారు. నేటి నుంచి పరీక్షలు ప్రారంభం కానుండగా ఎలాంటి ఒత్తిడికిలోను కాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు. ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా మీ వెంట ఉంటాయని ట్వీట్ చేశారు. నిబద్ధత, క్రమశిక్షణ, అభ్యాసం ద్వారా ఈ పరీక్షలను విజయవంతంగా పూర్తి చేయాలని సూచించారు.
Similar News
News January 7, 2026
ప్రమాద రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి: భద్రాద్రి కలెక్టర్

భద్రాద్రి జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్టమైన కార్యాచరణను అమలు చేయాలని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో రోడ్డు భద్రత కమిటీ సమావేశాన్ని ఆయన వీసీ ద్వారా నిర్వహించారు. రహదారుల భద్రతపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు వినూత్న కార్యక్రమాలను చేపట్టాలని కలెక్టర్ సూచించారు. అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రమాద రహిత జిల్లాగా తీర్చిదిద్దాలన్నారు.
News January 7, 2026
ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోవడం లేదు: కొప్పుల ఈశ్వర్

జగిత్యాలలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2 సంవత్సరాల క్రితం తమ చేతుల మీదగా ప్రారంభించిన ఎస్సీ స్టడీ సర్కిల్ కేంద్రాన్ని బుధవారం మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. కేసీఆర్ పాలనలో స్టడీ సర్కిల్ కేంద్రాలు విజయవంతంగా నడిచాయని, ప్రస్తుత ప్రభుత్వం వాటిని పట్టించుకోవడంలేదని విమర్శించారు. గతంలో స్టడీ సర్కిల్ ద్వారా యువతకు ఉద్యోగ ఉపాధి కల్పనకు ఎంతో కృషి చేశాయని అన్నారు.
News January 7, 2026
పాలమూరు: ట్రాక్టర్ రూటర్ కిందపడి బాలుడి మృతి

NGKL జిల్లా పెద్దకొత్తపల్లి మండలం ముష్టిపల్లిలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన దుడ్డు మల్లేష్ కుమారుడు మిట్టు(3)ను పొలానికి తీసుకుని పొలానికి తీసుకెళ్లగా, అక్కడ ప్రమాదవశాత్తు ట్రాక్టర్ రూటర్ టైర్ కిందపడి మృతి చెందాడు. ఒక్కగానొక్క కుమారుడు కళ్లముందే విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అల్లారుముద్దుగా పెంచుకున్న బాలుడి మరణాన్ని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు.


