News March 6, 2025
ఆళ్లగడ్డలో ఉచితంగా ‘ఛావా’ చిత్రం ప్రదర్శన

ఛత్రపతి శివాజీ కొడుకు జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘ఛావా‘ చిత్రం ఆళ్లగడ్డలోని రామలక్ష్మి థియేటర్లో నేడు ఉచితంగా ప్రదర్శించనున్నారు. మధ్యాహ్నం నుంచి 3 షోలు ప్రదర్శిస్తున్నామని థియేటర్ ప్రొప్రైటర్ అట్లా దిలీప్ కుమార్ రెడ్డి తెలిపారు. హిందూ ధర్మ పరిరక్షణలో భాగంగా థియేటర్ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రతి ఒక్క హిందూ సోదరులు సినిమాను చూడాలని ఆయన పిలుపునిచ్చారు.
Similar News
News March 2, 2026
పల్నాడు: నేడు కలెక్టరేట్లో PGRS

కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికతో పాటు రెవెన్యూ క్లినిక్ నిర్వహించనున్నట్లు పల్నాడు కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. ప్రజలు తమ ఫిర్యాదుల కోసం కలెక్టరేట్కు రావడంతో పాటు, ఇంటి నుంచే మీకోసం కాల్ సెంటర్ సేవలను వినియోగించుకోవచ్చని సూచించారు. 1100 నంబర్కు ఫోన్ చేసి లేదా Meekosam.ap.gov.in ద్వారా తమ సమస్యలను నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు.
News March 2, 2026
7 ఎమిరేట్స్ సమాఖ్య దేశమే UAE

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుదాబి. <<19276017>>UAE<<>> 7 ఎమిరేట్స్ అబుదాబి, దుబాయ్, షార్జా, అజ్మాన్, ఉమ్ అల్ క్వైన్, రస్ అల్ ఖైమా, ఫుజైరాల సమాఖ్య దేశం. 1971లో 6 ఎమిరేట్స్ ఓ గ్రూపుగా ఏర్పడగా 1972లో ఫుజైరా జాయిన్ అయింది. వీటికి సపరేట్గా ఏడుగురు చీఫ్లున్నా అబుదాబి అధినేతే UAEకి అధ్యక్షుడిగా ఉంటారు. ఈ దేశ విస్తీర్ణంలో పెద్దదై(84-87%)న అబుదాబి, ప్రపంచంలోనే మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ దుబాయ్లదే UAEలో ఆధిపత్యం.
News March 2, 2026
తూ.గో: మళ్లీ పులి కలకలం.. ట్విస్ట్ ఏంటంటే..!

గోకవరం మండలంలో పులి సంచరిస్తోందన్న పుకార్లతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. గతంలో రాయవరం వద్ద పట్టుబడిన పులిని మారేడుమిల్లి అడవుల్లో విడిచిపెట్టగా, అది మళ్లీ జనావాసాల్లోకి వచ్చిందన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. అయితే అటవీశాఖ అధికారులు తనిఖీలు చేసి పులి జాడ లేదని స్పష్టం చేశారు. సారా వ్యాపారులు తమ అక్రమ దందాల కోసం ఇలాంటి పుకార్లు పుట్టిస్తున్నారని స్థానికులు అనుమానిస్తున్నారు.


