News April 24, 2025

ఆళ్లగడ్డ టాపర్‌‌కు జ్ఞాపిక అందజేసిన DEO

image

పదో తరగతి ఫలితాలలో ఆళ్లగడ్డకు చెందిన అచ్చుకట్ల మహమ్మద్ ఆదిల్ 596 మార్కులతో రాష్ట్రస్థాయిలో 5వ ర్యాంకు సాధించారు. గురువారం డీఈవో జనార్దన్‌రెడ్డి ఈ విద్యార్థిని అభినందించి, ఆంధ్రప్రదేశ్‌ అన్‌ ఎయిడెడ్‌ ప్రైవేట్‌ స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్ జ్ఞాపికను బహుకరించారు. భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకొని తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొని రావాలని డీఈవో విద్యార్థికి సూచించారు. 

Similar News

News April 24, 2025

ఉగ్రదాడి ఘటనపై ముగిసిన అఖిలపక్ష భేటీ

image

పహల్‌గామ్‌ ఉగ్రదాడి ఘటనపై రాజ్‌నాథ్ సింగ్ ఆధ్వర్యంలో జరిగిన అఖిలపక్ష సమావేశం ముగిసింది. అమిత్ షా, జైశంకర్, జేపీ నడ్డా, కిరణ్ రిజిజు, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే తదితరులు పాల్గొన్నారు. ఉగ్రదాడి తర్వాత తీసుకున్న చర్యలపై కేంద్రం వివరించింది. మరోవైపు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ రేపు శ్రీనగర్‌ వెళ్లనున్నారు. ఉగ్రదాడి నేపథ్యంలో ఆయన అక్కడ పర్యటించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

News April 24, 2025

కొత్తగూడెం: మత్స్యకారుల వలకు చిక్కిన మొసలి

image

మత్స్యకారుల వలకు మొసలి చిక్కిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని తుమ్మలచెరువులో జరిగింది. గురువారం కొందరు వ్యక్తులు చేపలు పట్టడానికి వెళ్లగా, వలలో మొసలి ప్రత్యక్షమైంది. భయాందోళనకు గురైన స్థానికులు విషయాన్ని ఫారెస్ట్ అధికారులకు తెలియజేయగా, ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు మొసలిని గోదావరి నదిలో విడిచిపెట్టారు.

News April 24, 2025

PLAYOFFS: ఏ జట్టుకు ఎంత ఛాన్స్ అంటే?

image

ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్‌‌కు ప్లే‌ఆఫ్స్‌ వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ జట్టుకు 91% ప్లేఆఫ్స్‌కు వెళ్లే ఛాన్స్ ఉంది. అతి తక్కువగా CSKకు 0.8 శాతం మాత్రమే అవకాశం ఉంది. ఆ తర్వాత ఢిల్లీ(85%), బెంగళూరు(62%), పంజాబ్(58%), ముంబై(51%), లక్నో(34%), కోల్‌కతా(15%), రాజస్థాన్(2%), హైదరాబాద్(1%) ఉన్నాయి.

error: Content is protected !!