News April 9, 2025
ఆశావహ జిల్లాగా పార్వతీపురం మన్యం: కలెక్టర్

ఆశావహ జిల్లాగా పార్వతీపురం ఎంపిక అయినట్లు కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు కలెక్టరేట్లో మంగళవారం సమావేశం ఏర్పాటు చేశారు. వసతి గృహాల్లో చదివే విద్యార్థుల ఆరోగ్య ప్రమాణాలు మరింత మెరుగ్గా ఉండాలని సూచించారు. కుటుంబంలోని పిల్లల మాదిరిగా వసతి గృహ విద్యార్థులను ఆదరించాలని హితవు పలికారు. వసతి గృహాల్లో విద్యార్థులు చేరిన నాటి నుంచి ఆ విద్యార్థికి ప్రతి నెలా వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు.
Similar News
News April 17, 2025
భూభారతిపై మేడ్చల్ కలెక్టర్ సమావేశం

ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతి నూతన ఆర్ఓఆర్ చట్టం ద్వారా భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టర్ గౌతం అన్నారు. కలెక్టరేట్లో భూభారతిపై తహాశీల్దార్లు, జిల్లా రెవెన్యూ అధికారులకు అవగాహన కల్పించేందుకు అదనపు కలెక్టరు విజయేంధర్ రెడ్డితో కలిసి సమావేశమయ్యారు.
News April 17, 2025
PPM: మే 12వ తేదీ నుంచి సప్లమెంటరీ పరీక్షలు

ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్షలను మే 12వ తేదీ ప్రారంభం కానున్నట్లు డీఐఈఓ మంజుల వీణ తెలిపారు. ఇంటర్ పరీక్షల్లో తప్పిన విద్యార్థులు ఈ నెల 22 తేదీలోపు పరీక్ష పీజు చెల్లించేందుకు గడువు అని చెప్పారు. ఫస్ట్ ఇయర్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సెకండ్ ఇయర్కి మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు నిర్వహించనున్నట్లు గురువారం ఓ ప్రకటన ద్వారా తెలిపారు.
News April 17, 2025
విధ్వంసం.. 26 బంతుల్లో సెంచరీ

యూరోపియన్ క్రికెట్ సిరీస్(T10)-ఇటలీలో సంచలనం నమోదైంది. సివిడేట్ జట్టుతో మ్యాచ్లో మిలానో ప్లేయర్ జైన్ నఖ్వీ 26బంతుల్లోనే శతకం బాదారు. క్రికెట్ హిస్టరీలో ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ. అతను మొత్తంగా 37 బంతుల్లో 160* రన్స్(24 సిక్సర్లు, 2 ఫోర్లు) చేశారు. ఇన్నింగ్స్ 8, 10వ ఓవర్లలో 6 బంతులకు 6 సిక్సర్లు కొట్టారు. నఖ్వీ విధ్వంసంతో ఆ జట్టు 10 ఓవర్లలో 210/2 స్కోర్ చేయగా, ప్రత్యర్థి టీమ్ 106 పరుగులకే ఆలౌటైంది.