News December 12, 2025
ఆసిఫాబాద్లో ప్రశాంతంగా ముగిసిన తొలి విడత ఎన్నికలు

ఆసిఫాబాద్ జిల్లాలో పంచాయతీ తొలి విడత ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడంలో పోలీసుల కృషి విలువైందని ఎస్పీ నితికా పంత్ తెలిపారు. లింగాపూర్, సిర్పూర్(యు), కేరమేరి, వాంకిడి, జైనూర్ అటవీ ప్రాంతాల్లో స్పెషల్ పార్టీలు విస్తృతంగా ఏరియా డామినేషన్, ఫుట్ డ్రిల్ చేపట్టాయి. 114 పోలింగ్ కేంద్రాల్లో 53 సెన్సిటివ్గా గుర్తించి ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు.
Similar News
News December 12, 2025
పొగమంచు వేళల్లో వాహనాల రాకపోకలపై నిషేధం: అనిత

AP: ఏజెన్సీ ప్రాంతాల్లో వాహన ప్రమాదాల నేపథ్యంలో రాత్రి పూట పొగమంచు వేళల్లో బస్సు, ఇతర వాహన రాకపోకలను నిషేధిస్తున్నట్లు మంత్రి అనిత తెలిపారు. చింతూరు-మారేడుమిల్లి రోడ్డులో BUS ప్రమాదంలో 9మంది మృతి బాధాకరమన్నారు. ‘మృతుల కుటుంబాలకు పరిహారమిస్తాం. ఘాట్ రోడ్లలో వాహనాలు నడిపేవారికి ప్రత్యేక డ్రైవింగ్ లైసెన్స్ ఉండేలా చర్యలు తీసుకుంటాం. చిన్న తప్పిదాల వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయి’ అని పేర్కొన్నారు.
News December 12, 2025
NHIDCL 64 పోస్టులకు నోటిఫికేషన్

<
News December 12, 2025
మాజీ సైనికులు పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

మాజీ సైనికుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ వినోద్ కుమార్ సూచించారు. ‘స్పర్శ’ కార్యక్రమం ద్వారా మాజీ సైనికులు, వారి వితంతువులకు పింఛను నేరుగా బ్యాంకు ఖాతాలకు చేరుతుందని తెలిపారు. సమస్యల పరిష్కారానికి, పింఛను అవగాహనకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. మాజీ సైనికులు సమాజానికి స్ఫూర్తిదాయకంగా ఉండాలని ఆయన కోరారు.


