News February 7, 2025

ఆసిఫాబాద్‌ ఇన్‌ఛార్జ్ డీఈవోగా ఇమ్మాన్యుయల్

image

ఆసిఫాబాద్ జిల్లా ఇన్‌ఛార్జ్ డీఈవోగా ఇమ్మాన్యుయల్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో జిల్లా విద్యాధికారిగా విధులు నిర్వహిస్తున్న యాదయ్య దీర్ఘకాలిక సెలవు పెట్టడంతో ఆయన స్థానంలో ఇన్‌ఛార్జ్ డీఈవోగా ఇమ్మాన్యుయల్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన డీఈవో కార్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.

Similar News

News March 6, 2026

HNK: యాక్సిడెంట్‌లో మరణించిన విద్యార్థులు వీరే

image

హసన్‌పర్తి వద్ద జరిగిన <<19313318>>రోడ్డు ప్రమాదం<<>>లో ఎస్సార్ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్న వరంగల్ ఎల్లమ్మ బజార్‌కు చెందిన ఆకుతోట సుప్రతిక, మంగపేటలోని రాజుపేటకు చెందిన జునైద్ అక్కడికక్కడే మృతి చెందారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఎంజీఎం మార్చురీకి తరలించారు. మృతుల తల్లిదండ్రులు, బంధువులు మార్చురీకి చేరుకొని గుండెలవిసేలా రోదించారు. అక్కడున్నవారు సైతం కంటతడి పెట్టారు.

News March 6, 2026

రామగుండం: నాలుగేళ్ల చిన్నారిపై కుక్కల దాడి

image

రామగుండం కార్పొరేషన్ 39వ డివిజన్ కార్పొరేటర్ తిప్పారపు మానస కుమారుడు నాలుగేళ్ల చార్విక్ శుక్రవారం ఇంటి ముందు ఆడుకుంటున్న సమయంలో వీధి కుక్కలు దాడి చేశాయి. దీంతో తల, శరీర భాగాలపై తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు గమనించి ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకువెళ్లారు. పట్టణంలో కుక్కల బెడద తీవ్రంగా ఉందని, వీటిని నిర్మూలించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

News March 6, 2026

నిజామాబాద్: ఏసీ గదులు వదిలి గ్రామాల బాట పట్టండి: మంత్రి సీతక్క

image

నిజామాబాద్ కలెక్టరేట్‌లో జరిగిన సమీక్షలో మంత్రి సీతక్క అధికారులకు కీలక దిశానిర్దేశం చేశారు. 99 రోజుల ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా అధికారులు ఏసీ గదులు వదిలి గ్రామాల బాట పట్టి సమస్యలు తెలుసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. పెండింగ్ ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలన్నారు. అభివృద్ధిలో నిజామాబాద్ జిల్లాను అగ్రగామిగా నిలపాలన్నారు.