News April 17, 2025
ఆసిఫాబాద్ కలెక్టర్ నేటి పర్యటన వివరాలు

ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేష్ ధోత్రే గురువారం వాంకిడి మండలంలో పర్యటిస్తారని MRO రియాజ్ అలీ తెలిపారు. గురువారం ఉదయం 9 గంటలకు మండలకేంద్రంలోని రైతువేదికలో భూ భారతీ 2025 మీద అవగాహన సదస్సులో పాల్గొంటారని పేర్కొన్నారు. సదస్సుకు అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ), RDO తదితర ఉన్నతాధికారులు హాజరవుతారన్నారు. రైతులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
Similar News
News April 19, 2025
ALERT: నేడు భారీ వర్షాలు

AP: నేడు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. అల్లూరి, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, విశాఖ, తూర్పుగోదావరి, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అటు తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది.
News April 19, 2025
మల్లాపూర్: చెరువులో పడి బాలుడి గల్లంతు

మల్లాపూర్ మండల శివారులోని లింగన్నచెరువులో శుక్రవారం బాలుడు గల్లంతైనట్లు గ్రామస్థులు తెలిపారు. గ్రామస్థుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పుట్ట రాజేశ్(13) చెరువులోకి స్నానానికి వెళ్ళి గల్లంతైనట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చెరువు ఒడ్డున బాలుడి దుస్తులు, చెప్పులు ఉండటంతో పొలీసులకు సమాచారం ఇచ్చారు. గజ ఈతగాళ్ళతో చెరువులో వెతికిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News April 19, 2025
క్రికెట్ బెట్టింగ్.. చల్లపల్లిలో ఏడుగురు అరెస్ట్

చల్లపల్లిలో క్రికెట్ బెట్టింగులకు పాల్పడే వారిని పోలీసులు గుర్తించి చర్యలు చేపట్టినట్లు ఎస్ఐ సుబ్రహ్మణ్యం శుక్రవారం తెలిపారు. డీఎస్పీ తాళ్లూరి విద్యశ్రీ ఆదేశాల మేరకు సీఐ ఈశ్వరరావు పర్యవేక్షణలో విస్తృత తనిఖీలు నిర్వహించి ఎనిమిది మంది క్రికెట్ బెట్టింగ్ జూదరులను గుర్తించినట్లు తెలిపారు. వారిలో ఏడుగురిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ సుబ్రహ్మణ్యం తెలిపారు.