News February 28, 2025

ఆసిఫాబాద్ జిల్లాలో 74.08% పోలింగ్ శాతం నమోదు

image

మెదక్-నిజామాబాద్-కరీంనగర్- అదిలాబాద్ ఉపాధ్యాయుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. ఆసిఫాబాద్ జిల్లాలోని 17 పోలింగ్ కేంద్రంలో పోలింగ్ నిర్వహించారు. ఎమ్మెల్సీ పట్టుభద్రులు 6,137 ఓట్లకు గానూ 4,546 పోలవ్వగా 74.8% పోలింగ్ నమోదైందని చెప్పారు. వీరిలో పురుషులు 3,278,మహిళలు 1,268 మంది ఓటు వినియోగించుకున్నారు. 1,591 మంది ఓటుకు దూరంగా ఉన్నారు. కాగా ఏప్రిల్ 3న కౌంటింగ్ జరుగనుంది.

Similar News

News November 8, 2025

పావలా వడ్డీకే రుణాలు: తిరుపతి కలెక్టర్

image

KVBపురం(M)లో రాయల చెరువు తెగి ఐదు ఊర్లు నీట మునిగిన విషయం తెలిసిందే. వరద ధాటికి 57 మూగ జీవులు(26 ఆవులు, 18 గేదెలు, 13 గొర్రెలు) చనిపోయినట్లు సమాచారం. కొట్టుకుపోయిన జీవాలు కొన్ని ఇంటి బాట పట్టాయి. పశువులను కోల్పోయిన వారిని నష్ట పరిహారం అందిస్తామని అధికారులు తెలిపారు. బాధిత కుటుంబాలకు డ్వాక్రా ద్వారా పావలా వడ్డీకే రుణాలు మంజూరు చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారన్నారు.

News November 8, 2025

కరీంనగర్ జిల్లా ప్రగతిపై గవర్నర్ సమీక్ష

image

కరీంనగర్ జిల్లా పర్యటనలో భాగంగా గవర్నర్ శుక్రవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా అధికారులు, ప్రముఖులతో ముఖాముఖి నిర్వహించారు. అంతకుముందు శాతవాహన యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. కలెక్టర్ పమేలా సత్పతి పవర్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా సమగ్ర స్వరూపాన్ని, కేంద్ర, రాష్ట్ర పథకాల అమలు తీరును గవర్నర్‌కు వివరించారు. పథకాలు సమర్థవంతంగా అమలు అవుతున్నాయని కలెక్టర్ పేర్కొన్నారు.

News November 8, 2025

KNR: విద్యార్థులకు రాజ్యాంగ హక్కులపై అవగాహన

image

జాతీయ న్యాయ సేవాధికార సంస్థ దినోత్సవం సందర్భంగా KNR జిల్లా కొత్తపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సును శుక్రవారం నిర్వహించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రెటరీ, సీనియర్ సివిల్ జడ్జి కె. వెంకటేష్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. విద్యార్థులకు రాజ్యాంగం కల్పించిన హక్కులు, వారి భద్రత కోసం రూపొందించిన చట్టాల గురించి సవివరంగా వివరించారు.